chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్

చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా నిన్న పెట్టిన ట్వీట్ కు అర్ధమేమిటో ఈరోజు తెలిసింది. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో తేలకపోతే ఏమయింది సుప్రీంకోర్టు ఉందిగా అంటున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ బాబు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

New Update
Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఏసీబీ కోర్టులో తేలలేదు...హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పటికే చాలా దర్యాప్తు జరిగింది...ఇప్పడు దీనిపై తాము ఎలా విచారిస్తాము...అందుకే కేసును కొట్టేస్తున్నామని హైకోర్టు చెప్పింది. దీనిని సవాలు చేస్తు చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

చంద్రబాబు కేసుల విషయంలో నిన్న చాలా కీలక పరిణామాలు జరిగాయి. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు కూడా బాబు రిమాండ్ ను మరో రెండు రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మామూలుగా అయితే బాబు రిమాండ్ నిన్నటితో అయిపోవాలి. కానీ దానిని రెండు రోజులు పొడిగించిన ేసీబీ కోర్టు...రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతించింది. దాని ప్రకారం ఈరోజు ఉదయం రాజమండ్రి జైలుకు చేరుకున్న సీఐడీ అధికారులు ఉదయం 9 నుంచి బాబును ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఇది కొనసాగనుంది. ప్రతీ గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తూ దీనిని కొనసాగిస్తున్నారు. ఈరోజుతో పాటూ రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యహ్నం 1 గంటలకు ముగిసింది. ఒంటి గంటల నుంచి 2 గంటల వరకు.. అంటే గంట పాటు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు సీఐడీ అధికారులు. ఈ సమయంలో ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని చేయనున్నారు చంద్రబాబు. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ విచరాణ కొనసాగనుంది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment