Business: లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరిగి 76,500 స్థాయిలో.. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23250 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ 2.7% పెరిగింది. ఫార్మా,ఆటో దాదాపు ఒక శాతం పెరిగాయి.

New Update

ఈ మధ్య వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాలు చూస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే సూచీలు ఈరోజు ఉదయం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం మార్కెట్ మొదలయ్యే సమయానికి సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరిగి 76,500 స్థాయిలో.. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23250 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌ సూచీల్లో ఇన్ఫోసిస్‌, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, జొమాటో, టైటాన్‌, టాటాస్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండా..బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. 

లాభనష్టాల్లో విదేశీ మార్కెట్లు

మరోవైపు అమెరికా మర్కెట్లు మాత్ర డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అక్కడ రోజు ముగిసేసరికి అమెరికా డౌ జోన్స్ 0.027% తగ్గి 41,953 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.33%, ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 0.22% పడిపోయాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే జపాన్ నిక్కీ 0.37% పెరిగింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 1.67% తగ్గింది. చైనా షాంఘై కాంపోజిట్ 0.68% తగ్గింది. నిన్న విదేశీ పెట్టుబడిదారులు రూ.3,239.14 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు రూ.3,136.02 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 

Also Read: UK: లండన్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని ప్రమాదం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం, నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించడం వల్ల సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం.. నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. మార్నింగ్ 9.30 గంటల టైంలో సెన్సెక్స్‌ 1564 పాయింట్లతో 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లతో 23,288 దగ్గర కొనసాగుతోంది. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్‌వుతున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు