Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే.

ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు.

New Update
Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే.

Asia Cup India vs Pakistan : ఆసియా కప్ లో భారత్ -పాక్ మ్యాచ్ కు వర్షం మరోసారి అడ్డుపడింది. సూపర్ -4లో భాగంగా కొలంబోలో నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ 24.1 ఓవర్లకు 147 పరుగులు చేసింది. దాని తర్వాత వర్షం పడడంతో ఆటకు అంతరాయం కలిగింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ అవుట్ ఫీల్డ్ బాగా తడిగా ఉండడంతో మ్యాచ్ ను రిజర్వ్ డేకు పోస్ట్ పోన్ చేశారు. దీని ప్రకారం ఈరోజు మ్యాచ్ తిరిగి ప్రారంభం అవుతుంది. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్ మన్ గిల్ లు చెరో హాఫ్ సెంచురీ చేశారు. కోహ్లీ (Kohli), రాహుల్ (KL Rahul) క్రీజ్ లో ఉన్నారు.

కొలంబోలో ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. అలాంటప్పుడు రిజర్వ్ డే (Reserve day) కూడా మ్యాచ్ జరగకపోతే ఎలా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న ఎక్కడ అయితే ఆపేశారో అక్కడి నుంచి మ్యాచ్ ను మొదలుపెడతారు. వర్షం లేకపోతే అంతా సజావుగానే సాగుతుంది. కానీ వాన పడింది అంటే మాత్రం రూల్స్ మారిపోతాయి.

రిజర్వ్ డే రోజు వర్షం పడితే ఏం జరుగుతుంది...

మ్యాచ్ ఫలితం తేలాలంటే రూల్ ప్రకారం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాలి. దాని ప్రకారం భారత్ ఇప్పటికే 24 ఓవర్లు ఆడేసింది. కాబట్టి వర్షం కనుక పడితే డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను అంపైర్లు నిర్ణయిస్తారు. ఇది కూడా వర్షం పడి ఆగి మ్యాచ్ మళ్ళీ మొదలైతేనే. అలా కాలేదు అస్సలు మ్యాచే జరగలేదు అంటే మాత్రం మొత్తానికే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

పాపం భారత్...
ఒకవేళ మ్యాచ్ కనుక రద్దు అయితే టీమిండియాకు కష్టమే. సూపర్ -4 పాయింట్ల లిస్ట్ లో పాకిస్తాన్, శ్రీలంక ఇప్పటికే చెరో గెలుపును సొంతం చేసుకున్నాయి. కానీ భారత్ కు మాత్రం ఇదే మొదటి మ్యాచ్. ఇప్పటివరకు మన టీమ్ కు అసలు పాయింట్లే రాలేదు. మరోవైపు బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది కాబట్టి ఆ దేశం దాదాపు టోర్నీ నుంచి వెళ్ళిపోయినట్టే. దీని ప్రకారం ఈరోజు మ్యాచ్ రద్దయితే భారత్ కు ఒక పాయింట్ వస్తుంది. పాకిస్తాన్ కు ఒక పాయింట్ వచ్చి పట్టికలో మూడు పాయింట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫైనల్ కు చేరాలంటే తక్కిన అన్ని మ్యాచ్ లూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్ కు తరువాతి మ్యాచ్ లు శ్రీలంక, బంగ్లాదేశ్ తో ఉన్నాయి. ఈ రెండు టీమ్ లతో మ్యాచ్ లు గెలిస్తేనే 5 పాయింట్లతో భారత్ ఫైనల్ కు వెళ్ళగలుగుతుంది.

Also Read: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. యూఎస్ ఓపెన్ విజేతగా సెర్బియా స్టార్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా రూల్స్‌ను ఆయన మరింత కష్టతరం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశాన్ని  చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు వీసా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.  

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

అంతేకాదు భారత పౌరుల కోసం చైనా చాలావలకు వీసా సడలింపులు చేసింది. ఆ దేశాన్ని ప్రయాణాన్ని మరింత ఈజీగా చేసింది. భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు చైనాలో ప్రయాణించే వాళ్లకి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.  

చైనా వీసా తక్కువ ధరకు దొరకడం వల్ల భారతీయలకు ప్రయాణం మరింత సులవుగా మారింది. వీసా జారీ చేసేందుకు పట్టే సమయాన్ని కూడా తగ్గించేశారు. ఇది వ్యాపార,విహార యాత్రకు వెళ్లేవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా, భారత పర్యాటకులకు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలను ఇది ప్రోత్సహిస్తోంది. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ట్రేడ్‌వార్ మొదలుపెట్టారు. దీంతో చైనా భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక లాభాలపై ఆధారపడి ఉన్నాయని చైనా దౌత్యవాణిజ్య ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' చరిత్రలో ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవలేదు. ప్రపంచ దేశాలు అన్నీకలిసి సంప్రదింపులు, బహుళపక్ష సూత్రాలపై నిలపడి ఏకపక్ష చర్యలు, రక్షణవాద విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని'' అన్నారు.  

 rtv-news | trump | china | national-news 

Advertisment
Advertisment
Advertisment