AP News: మంచం కింద నక్కి నక్కి.. వ్యభిచార గృహంలో వైసీపీ నేత రాసలీలలు!

విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వైసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్‌నాయక్‌ను A10 గా నమోదు చేశారు. శంకర్ మంచం కింద నక్కి నక్కి దాక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

New Update
spa case vjwd

spa case vjwd Photograph: (spa case vjwd)

AP News: విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వేసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో బోర్డ్ పెట్టి లోపల స్పా ముసుగులో వ్యభిచారం నడిపిస్తుండగా పోలీసులు రైడ్స్ చేసి 23 మందిని పట్టుకున్నారు. అందులో 10 మంది నార్త్ అమ్మాయిలు, 13 మంది విటులున్నారు. అయితే ఈ పది మందిలో ఏపీ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు వడిత్య శంకర్‌నాయక్‌ సైతం అడ్డంగా బుక్ అయ్యారు. 

Also Read: Telangana:టికెట్‌ పై లేకపోయినా సరే..కట్టాల్సిందే ..ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్‌ ట్యాక్స్‌!

నక్కి నక్కి ముఖం దాచుకుంటూ..

ఈ మేరకు వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేయగానే కొంతమంది పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. అయితే శంకర్ నాయక్ మాత్రం తప్పించుకునే వీలులేక మంచంకింద దూరిపోయాడు. అయితే రూమ్ లో పోలీసులకు ఒక మహిళ మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి బాత్రూమ్, కబోర్డ్స్ వెతికారు.

Also Read: Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్‌ కు బెదిరింపు ఫోన్లు!

Also Read: Anushka Sarma: కోహ్లీ సూపర్‌ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!

చివరికి అనుమానం వచ్చి బెడ్ కింద టార్చ్ లైట్ కొట్టగా శంకర్‌నాయక్‌ నక్కి నక్కి ముఖం దాచుకుంటూ కనిపించాడు. వెంటనే పోలీసులు అతన్ని చేయిపట్టి బయటకు లాగారు. అప్పటికే చెమటలు పట్టిన శంకర్ ముఖం దాచుకుంటూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతల రాసలీలల బాగోతం బయటపడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అధికారులు, పోలీసులకు బెదిరింపులు..

ఇక సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకర్‌నాయక్‌.. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఫిబ్రవరి 9 వరకు శంకర్ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగారు. అధికారులు, పోలీసులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యభిచారం కేసులో శంకర్‌నాయక్‌ను ఏ10గా నమోదు చేశారు.

Also Read:  SLBC UPDATES: టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు!

 చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9,( స్పా)పై  సిబ్బందితో కలసి రైడ్ చేసి యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. 10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళలంతా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment