Hotels & Restaurant: భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు ఆ హోటల్స్ ఓపెన్!

భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పోలీస్ కమిషనర్‌ రాజశేఖరబాబు తెలిపారు.

New Update
vijayawada

Vijayawada Restaurants, hotels open till midnight

Hotels & Restaurant: భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పోలీస్ కమిషనర్‌ రాజశేఖరబాబు తెలిపారు. 

మొదట 3 నెలలు ప్రయోగాత్మకంగా..

ఈ మేరకు 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం హోటళ్లను అర్ధరాత్రి వరకూ ఉంచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా వైసీపీ ప్రభుత్వంలో దీనిపై ఆంక్షలు విధించారు. దీంతో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ లో మళ్లీ అర్థరాత్రి వరకు అమలు చేస్తున్నట్లు  పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు తెలిపారు. మొదట 3 నెలలు ప్రయోగాత్మకంగా పరిశీలించనుండగా విజయవాడతోపాటు ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 

Also Read: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!
 
ఇక విజయవాడకు రైళ్లు, బస్సుల్లో రాత్రి 10గంటల తర్వాత కూడా వేల సంఖ్యలో జనాలు వస్తున్నారని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ రాత్రి 9.30 దాటిన తర్వాత హోటళ్లు మూతపడటంతో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీంతో ఏ పన్ను చెల్లించకుండా రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముతున్న వారికి అర్ధరాత్రి వరకూ అనుమతి ఇస్తున్నారని, ప్రభుత్వానికి 13 రకాల పన్నులు చెల్లిస్తున్న తమకు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ విషయాన్ని విజయవాడ హోటళ్ల అసోసియేషన్‌తో చర్చించిన కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు సానుకూలంగా స్పందిస్తూ అనుమతి ఇచ్చారు. 

Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

ఇక నగరంలో సభ్వత్వం ఉన్నవి 144 రెస్టారెంట్లు. 46 హోటళ్లు ఉన్నట్లు తెలిపారు. సభ్యత్వం లేని హోటళ్లు 200కు పైగానే ఉన్నట్లు గుర్తించారు. చెన్నై నుంచి పినాకినీ, హైదరాబాద్‌ నుంచి శాతవాహన, విశాఖ నుంచి రత్నాచల్‌ సహా నవజీవన్‌ లాంటి రైళ్లన్నీ రాత్రి 9 తర్వాతే విజయవాడకు చేరుకుంటాయి. బస్సుల్లోనూ తెల్లవారుజామున ఎక్కువమంది ప్రయాణికులు దిగుతుంటారు. ఈ ప్రయాణికులకు బందరు రోడ్డులో ఈట్‌స్ట్రీట్, బీఆర్‌టీఎస్‌ రోడ్డులో సత్యనారాయణపురం వద్ద ఫుడ్‌కోర్టులు తప్ప మరో హోటల్‌ లేవు. ఈ నేపథ్యంలోనే రాత్రి 12గంటల వరకూ తెరిచి ఉంచాలని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి, విజయవాడ అధ్యక్షులు రమణ, కోశాధికారి మల్లిఖార్జున్‌ కోరగా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 


 vijayawada | midnight | today telugu news rtv telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment