Prakash district: ప్రకాశం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి!

ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
pakala beach

Prakash district pakala beach

Prakash district: పండగ వేళ ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులు కావడంతో పొన్నలూరు మండలం తిమ్మపాలెం కు చెందిన  5మంది కుటుంబ సభ్యులు ఈ రోజు  సరదాగా ఈతకు వెళ్లారు.  అయితే  సముద్రంలోకి ఈతకు దిగిన క్రమంలో ఐదుగురిలో..  నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.  నలుగురిలో మూడు శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. ఒకరిని స్థానికులు చూసి కాపాడారు. మిగిలిన ఒక్కరి కోసం పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ దుర్ఘటన  సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో జరిగింది. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. మృతులను మాధవ, జస్మిక, యామిని గా పోలీసులు గుర్తించారు.

Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి

Prakash district
Prakash district

Also Read :  సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!

విశాఖపట్నంలో మరో విషాదం

ఇది ఇలా ఉంటే విశాఖపట్నంలో మరో విషాదం జరిగింది. సంక్రాంతి పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. అపార్ట్మెంట్ సెల్లార్ సరదాగా ఆడుకుంటున్న చిన్నారిని  కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.  

Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

స్థానికుల వివరాల ప్రకారం.. సుజాతనగర్ కు చెందిన దంపతులు పిల్లలతో కలిసి గాజువాక పరిధిలోని  సెలస్ట్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తమ బంధువుల ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చారు. ఈ క్రమంలో తమ పిల్లలు అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో ఆడుకుంటుండగా అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆ చిన్నారిని కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫార్మా కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి  నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

Also Read: Daaku Maharaaj Day 1 Collections: 'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ ఊచకోత.. తొలి రోజే ఎన్ని కోట్లంటే !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు విఐపి బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment