Paster Praveen: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు. 

New Update
AP

Paster Praveen Case Briefing

మిస్టరీగా మారిన హైదరాబాద్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఎలా మృతి చెందారో పోలీసులు ఛేదించారు. అత్యాధునిక ఆధారాలు సేకరించడమే కాకుండా.. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్ మార్టం నివేదికలను సమగ్రంగా విశ్లేషించారు. దాని ప్రకారం మార్చి 24న రాజమండ్రికి దగ్గరలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో మృతి చెందారని నిర్ధించారు. ఈ విషయాన్ని ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ వివరించారు.  

Also Read :  పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?

Also Read :  ఆల్కహాల్‌తో మెదడుకు పొంచిఉన్న ముప్పు

బైక్ మీద వెళ్ళడంతో యాక్సిడెంట్..

కేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ లో ఎస్పీ నరసింహ కిశోర్ తో కలిసి ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలో ప్రవీణ్ మద్యం తాగినట్లు ఉందని...తల, శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని..యాక్సిడెంట్ లో ఇవి తగిలి ఉండొచ్చని చెప్పారు. ఘటనాస్థలంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఆయన 70 కి.మీ వేగంతో నాలుగో గేరులో వెళుతున్నట్టు ఆర్టీఏ అధికారులు చెప్పారని వివరించారు. ప్రవీణ్ మృతిలో అనుమానాలు రేకెత్తడంతో కుటుంబసభ్యులతో పాటూ 92 మంది సాక్షులను విచారించామని చెప్పారు. వారెవరికీ ఒకరితో ఒకరికి పరిచయాలు లేవని...ఆయన రాజమండ్రి వస్తున్నట్టు ప్రవీణ్ భార్య, ఇదే ఊరుకు చెందిన ఆకాశ్, అడపాక జాన్ కు మాత్రమే తెలుసునని తెలిపారు. కుటుంబ సభ్యులు సైతం మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని ఐజీ అశోక్ మకుమార్ చెప్పారు.    

అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ కావాలనే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద బయలుదేరారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఆయన కొద్ది రోజులు ఉండాల్సి వస్తుందని, పైగా ఆ వూర్లో అతనికి పనులు ఉండడం వలన బైక్ చేతిలో ఉంటే ఉపయోగపడుతుందని..హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చారని చెప్పారు. హైదరాబాద్ లో మిత్రుడు ఒకరు బైక్ మీద వెళ్ళొద్దని కూడా చెప్పారని అయినా ప్రవీణ్ వినలేదని అన్నారు. 

Also Read: AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

Also Read :  నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి

 

paster praveen | today-latest-news-in-telugu | today-news-in-telugu | latest-telugu-news | road-accident | andhra-pradesh-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు