/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలు చేరుకున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బయటికొస్తే ఎండ.. లోపలుంటే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వాతావరణ శాఖ చల్ల చల్లని కూల్ కూల్ వార్త వినిపించింది. ఈ వారంలో ఏపీలోని ఆ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అనుకుంటుంది.
Also Read: CM MK Stalin: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు..
సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిపింది.
Also Read: Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!
సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం అసౌకర్యంగా ఉంటుందని.. ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని తెలిపింది.
మంగళవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దీని తరువాత ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 3 తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఏప్రిల్ 3 తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని… ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వాతావరణ సూచన జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, నైరుతి గాలులు వీయటం వల్ల వాతావరణ పరిస్థితులు ప్రభావితమవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేడి, తేమ ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
Also Read: BIG BREAKING: ఏపీలో రేపు సెలవు
Also Read: America-Iran: అటు ట్రంప్ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్...!
rains | east-godavari | imd | imd alert | imd-issued-heavy-rain-alert-in-ap | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates