Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు.

New Update
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నారా లోకేష్‌.. గంజాయిపై ఫిర్యాదు

Nara-Lokesh

 ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అదిరిపోయే వార్త చెప్పారు. గత ప్రభుత్వంలోని పెండింగ్‌ రీయింబర్స్‌మెంట్ బకాయిలనూ విడుదల చేస్తామన్నారు. అంతేకాకుండా ఇక సెమిస్టర్‌ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును కాలేజీల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నట్లు వివరించారు.

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక గత ప్రభుత్వ హయాంలో రూ.4వేల కోట్ల బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. మంత్రి లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు. అక్కడ రూ.7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్‌ ఇండోర్‌ మైదానం, ఏరోబిక్స్, తైక్వాండో, యోగా సెంటర్‌ను ప్రారంభించారు. అక్కడ ఇండోర్‌ గ్రౌండ్‌లో మంత్రి లోకేష్ సరదాగా షటిల్‌ ఆడారు.

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

మంత్రి లోకేష్ పద్మావతి ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినులతో సమావేశం అయ్యారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్నారు. పద్మావతి మహిళా యూనివర్శిటీ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా ఇక్కడి విద్యార్థినులు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు రాణించేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. 

మెరుగైన ఉద్యోగావకాశాలు...

ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్‌ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు ఏర్పాటు చేశామని.. కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం చంద్రబాబుతో పోరాడుతున్నాను అన్నారు.

మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళంలోని ఆశా కన్వెన్షన్‌ సెంటర్‌‌లో నిర్వహించిన ఐటీసీ ఎక్స్‌-2025 సదస్సుకు హాజరయ్యారు. మూడురోజులపాటు ఆలయాల నిర్వహణ, ఆర్థిక వనరుల కూర్పు, పరిపాలన, క్యూ లైన్ల నిర్వహణ వంటి ప్రధాన అంశాలపై సదస్సు నిర్వహించారు. దేవాలయాల ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి లోకేష్. తమ ప్రభుత్వం ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు నిధులు పెంచిందన్నారు.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే తిరుమలలో అనేక మార్పులు వచ్చాయని.. భక్తులకు ఉచిత దర్శనం, అన్నదానంతోపాటు వసతి, విద్య, వైద్య సౌకర్యాలు ప్రారంభించారన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు డ్రోన్లు ఉపయోగిస్తామన్నారు.

Also Read: Zelensky: ట్రంప్‌ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు!

Also Read: Champions Trophy: మొదటి మ్యాచ్ లోనే చిత్తు అయిన ఆతిథ్య జట్టు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Telangana Rains : తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షాలు!

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి- భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
 Heavy rains in Telangana.

Heavy rains in Telangana.

Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి- భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. శివారు ప్రాంతాలైన ఘట్‌కేసర్‌, చర్లపల్లి తదితర ఏరియాల్లో మోస్తరు వర్షం పడుతోంది. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

తెలంగాణలో హైదరాబాద్, కొన్ని జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం వేళల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండవేడిమి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చు, కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ ఆదివారం ఉదయం వేళనుంచి ఉత్తర తెలంగాణలో కొంత మోస్తరు వానలు కురుస్తున్నాయి. తిరిగి సాయంత్రం వేళ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల వాన మొదలై.. రాత్రి 8 గంటల వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణపై రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. గాలి వీచినప్పుడు ఉపశమనంగా ఉంటుంది.

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం.. ఈ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఎండ కూడా వస్తూ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో వాన మొదలై.. క్రమంగా పెరుగుతూ.. భారీ వర్షంగా మారి.. రాత్రి 7 వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 8 తర్వాత పశ్చిమ రాయలసీమలో జల్లులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 18 కిలోమీటర్లుగా ఉంది.

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

 ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏపీలో ఉత్తరాంధ్రలో 35 డిగ్రీల సెల్సియస్, కోస్తాలో 38, రాయలసీమలో 40 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. తెలంగాణలో 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. చెప్పాలంటే ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంత తక్కువగానే ఉంటాయి.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు