New Virus: గుంటూరులో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు!

ఏపీ గుంటూరులో కొత్త వైరస్ 'గులియన్ బారి సిండ్రోమ్' విజృంభిస్తోంది. 7కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. 

New Update
Virus

AP Guntur 'Gulian Bari Syndrome' 7 cases positive

New Virus: ఏపీ గుంటూరు(Guntur)లో కొత్త వైరస్ విజృంభిస్తోంది. జీజీహెచ్‌లో 'గులియన్ బారి సిండ్రోమ్' (GBS) బాధితులు పెరుగుతున్నారు. ఈ ఉదయం ఒకరికి సోకినట్లు వెల్లడించిన వైద్యులు మధ్యాహ్నం వరకు మరో 6 కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం 7గురు జీబీఎస్ వ్యాధి బారినపడ్డట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

ఇద్దరి పరిస్థితి విషమం..

ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా ఒకరు వెంటిలేటర్‌పై, మరొకరు ఐసియులో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సాధారణ వార్డులో చికిత్స పొందిన ఐదుగురు బాధితుల్లో చికిత్స అనంతరం ఇద్దరినీ డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌కు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు బాధితులు సంఖ్య పెరగటంతో అధికారులు, వైద్య బృందాన్ని అప్రమత్తం చేశారు. 

ఇది కూడా చదవండి: AP Schools: మా బడి మాకు కావాలి.. MEO ఆఫీస్ ముందు గ్రామస్తుల నిరసన!

ఈ మేరకు న్యూరాలజీ వార్డును పరిశీలించిన క్రిష్ణబాబు ప్రభుత్వ సంసిద్ధత, జీజీహెచ్‌లో చేసిన ఏర్పాట్లపై సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ఇది కొత్త వ్యాధి కాదు. లక్ష కేసుల్లో ఒకటి రెండు కేసులు నమోదవుతాయి. పుణేలో అధిక కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కాకుండా ఇతర కారణాలు ఏమైనా ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నాం.

ఇది కూడా చదవండి: మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?

 ప్రతి నెలా పది పదికొండు కేసులు రావటం సాధారణమే. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శానిటేషన్ మెయింటైన్ చేసుకోవాలి. తప్పుగా ప్రచారం చేయవద్దు. అసాధారణ పరిస్థితి ఏమీ లేదు. ఇమ్యూనో గ్లోబిన్ ఇన్ జంక్షన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. 

ఇది కూడా చదవండి: బిగ్ షాక్..  మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

త్వరగా కోలుకోవాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి. 

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment