CM Chandrababu: కేసీఆర్, జగన్‌కు భిన్నంగా చంద్రబాబు ధోరణి.. సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న విశ్లేషకులు!

ఒక రాజకీయ పార్టీ గెలుపు, ఓటమికి అనేక కారణాలుంటాయి. కేసీఆర్ కాంగ్రెస్‌పై, జగన్ ఈవీఎంలపై ఆరోపిస్తే చంద్రబాబు మాత్రం ప్రతి ఓటమికి తానే కారణమని అంగీకరించారు. దీంతో ఓటమికి బాధ్యతపడిన వ్యక్తికే కూటమి గెలుపు క్రెడిట్ దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.

New Update
kcr jagan babu

kcr jagan babu Photograph: (kcr jagan babu)

CM Chandrababu: ఒక రాజకీయ పార్టీ గెలుపు, ఓటములకు చాలా కారణాలు ఉంటాయి. పార్టీ అధినేతల సమర్థత, విధానాలు, వ్యూహాలు, ఆలోచనా ధోరణి వంటివన్నీ కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇందుకు ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆరే ఉదాహరణ. అయితే ఓటమిని ఒప్పుకోవడం, బాధ్యత తీసుకోవడం కూడా అధినేతలకు అవసరమే. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్‌, కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను చాలా చులకనగా చేసే వారనే ఆరోపణలు ఉన్నాయి. తమ మాటే శాసనంగా వ్యవహరించేవారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ సమర్ధుడనిపించుకున్నా.. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వ్యూహాలు బెడిసికొట్టి.. ఓటమిని చవిచూశారు.   

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

అధినేతలే బలమూ, బలహీనత..

మరోవైపు జగన్‌ ఓటమికి అమరావతి, పోలవరం విషయాలు కీలక పాత్ర పోషించాయి. వీటి విషయంలో జగన్‌ తీసుకున్న అనుచిత నిర్ణయాలు, అభివృద్ధికి బదులు సంక్షేమ పథకాలను ఎంచుకోవడం వల్లనే వైసీపీ ఓడిపోయింది. 2019లో 151 సీట్లతో ప్రభంజనం చూసిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ రెండు పార్టీలకు వాటి అధినేతలే బలమూ, బలహీనత. కానీ వారి తప్పొప్పులు ఆ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

సర్దిచెప్పుకున్న కేసీఆర్, జగన్..

ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ హీరో సొంతం చేసుకుని, ఫ్లాప్ అయితే దర్శకుడిపైకి నెట్టేసినట్లే వారిద్దరూ కూడా తమ పార్టీల ఓటమిని ప్రత్యర్ధులకు ఆపాదించి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిందని కేసీఆర్ వాదిస్తే, EVM లను ట్యాపరింగ్‌ చేశారని.. అందుకే తాము ఓడిపోయామని జగన్‌ సర్ధి చెప్పుకున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం తానేనని.. దానికి తనదే పూర్తి బాధ్యత అని ఒప్పుకున్నారు.


Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

ఇలా పార్టీ ఓటమిని అంగీకరించడం.. ఓటమి కారణాలు తెలుసుకొని ఆత్మవిమర్శలు చేసుకోవడం.. వాటిని సరిదిద్దుకోవడం, ఓటమికి పూర్తి బాధ్యత వహించడం చాలా హుందాగా ఉంటుంది. అప్పుడే ఆ పార్టీలు గెలిచినప్పుడు కూడా వారు ఆ గెలుపు క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి నైతిక అర్హత పొందుతారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు.. ఓటమికి బాధ్యత తీసుకున్నారు కాబట్టి కూటమి గెలుపు క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలో మైనర్ బాలికను మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు. ఈ ఘటనకు కారణమైన ఎనిమిది మంది నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
gang rape in Bengaluru

దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. అందులోనూ సామూహిక అత్యాచారాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో తెలియక తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపించడానికే భయపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది. కొంతమంది యువకులు కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు.

ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

మూడు రోజుల తర్వాత.. 

మూడు రోజుల తర్వాత మైనర్ బాలికను విడిచిపెట్టేసిన నిందితులు..తనను ఆటో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సహాయంతో బాలిక విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాత్యాన్ని  చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...దానిని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఆత్కూరు పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి...అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుసుకున్నారు. నిందితుల్లో ఒకరు పదతరగతి పరీక్షలు రాసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు అందరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.  

Also Read: USA: పుతిన్ కు ట్రంప్ కాల్...యుద్ధం ముగింపుకు చర్చలు

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

Advertisment
Advertisment
Advertisment