AP News: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం.. క్యాబినెట్‌లో కీలక నిర్ణయం!

బడి పిల్లలకు ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది. డొక్కా సీతమ్మ పథకంలో ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే మెనూలో మార్పులు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తామన్నారు నాదేండ్ల మనోహార్.

author-image
By srinivas
New Update
mid day meal

AP Cabinet decided mid-day meal with thin rice

AP News: బడి పిల్లలకు ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్‌ జరిగింది. ఇందులో నాణ్యమైన, పోషకాలు కలిగిన సన్న బియ్యం( ఫైన్ రైస్)తో మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆసక్తికర చర్చ జరిగింది. మోనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్‌లో లోకేష్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్ లో ప్రస్తావించారు.

క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..

సన్న బియ్యం (ఫైన్ రైస్ ) అందిస్తే మరింత క్వాలిటీతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని క్యాబినెట్ ముందు ప్రస్తావించారు. ఇందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కావాలని నారా లోకేష్ కోరారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను మంత్రులు బలపరచి అంగీకరించారు. లోకేష్ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  మంత్రులకు తెలిపారు.

ఇది కూడా చదవండి: US Woman Viral News: ప్రేమ నిజంగానే గుడ్డిది.. దేశాలు దాటిన ఆన్‌లైన్ లవ్‌లో ఆమెకు 33, అతనికి 19

లోకేష్ ప్రతిపాదనతో ఇకపై చిన్నారులకు మరింత నాణ్యమైన భోజనం అందిచనున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం సరఫరా చేసేందుకు అంగీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రిని లోకేష్ కొనియాడారు. మీ చొరవతో పిల్లలకి పౌష్టిక ఆహారం అందుతుందని లోకేష్‌కు సహచర మంత్రుల అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Buddha Venkanna: జగన్ ఓ పశుపతి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ.. జగన్, పవన్ లపై హర్షకుమార్ సంచలన కామెంట్స్!

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు. 

New Update
jagan-and-harsha-kumar

jagan-and-harsha-kumar

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

ముమ్మాటికీ హత్యే

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ హత్యేనని..  న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని హర్షకుమార్ వెల్లడించారు. ఇందుకోసం  2025 శనివారం 19వ తేదీన గుడ్ ఫ్రైడే  రోజున సాయంత్రం 4 గంటల నుండి 6.30 గంటల వరకు ఎవరికి వారు వచ్చి ప్రవీణ్ దేహం ఎక్కడ దొరికిందో కొవ్వూరు దివాన్ చెరువు రోడ్ లో నయార పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరికి వారు ఒక కొవ్వొత్తు తెచ్చుకొని అక్కడ వెలిగించి వెళ్ళండని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రవీణ్ ను  ప్రభుత్వమే హత్య చేయించిందని నమ్మే ప్రతి ఒక్కరు రావలన్నారు హర్షకుమార్. అలాగే ఈస్టర్ ఆదివారం ఆంధ్రా, తెలంగాణలో ఉన్న ప్రతి సమాదుల దొడ్డి దగ్గర ప్రవీణ్ ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలన్నారు. మన నిరసనను కూడా చాలా శాంతి పంథంలో తెలుపుదామని.. తనకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని హర్షకుమార్ వీడియోలో కోరారు.  

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ప్రభుత్వం ఇప్పటి దాకా స్పందించలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించలేదు....

Posted by GV Harsha Kumar on Wednesday, April 16, 2025

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

Advertisment
Advertisment
Advertisment