Traffic police: నాన్న నెమ్మదిగా రా.. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం!

ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు. 

New Update
ap traffic

Ap traffic

Traffic police: ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు. 

డబ్బులు ఊరికే రావు..

ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు కొత్తగా 1వ తేది నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ అధినేత ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్ అంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా  గమ్యస్థానాలకు చేరాలని   డీఎస్పీ ప్రసాద్ కోరుతున్నారు. ప్రతి ఒక్కరికీ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, రూల్స్ అతిక్రమిస్తే ఫైన్స్ విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా పడుతుందని తెలిపారు. 

కేంద్ర మోటార్ వెహికల్ చట్టం..

మార్చి ఒకటో తేదీ నుండి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీలోని ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలను పెంచినట్లు ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5000, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 4000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో రూ. 1500 ఫైన్‌ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి రూ. 1000, అలాగే బైక్ వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని పక్షంలో రూ. 1000 ,  అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 1500, రెండవసారి రూ. 10000, ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించ కుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 150, రెండవసారి రూ. 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు రూ. 750, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో రూ. 1000, కారు డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించని పక్షంలో మరో రూ. 1000, వాహన రిజిస్ట్రేషన్ లేనిపక్షంలో రూ. 2000, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 5000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి రూ. 5000, రెండవసారి రూ. 10000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే రూ. 1000, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నారు.

Also Read: ఇడ్లీ-సాంబార్‌ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

New Update

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏపీలో విమాన సర్వీస్‍ల జాప్యంపై గంటా శ్రీనివాస్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ టూ ఏపీ వయా తెలంగాణ అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు రామ్మోహన్‍కి ఫోన్ చేయొచ్చు కదా..? అని ఫైర్ అయినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావొద్దని గంటాకు టీడీపీ హై కమాండ్ స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది. 

ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..

విశాఖ నుంచి అమరావతికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని నిన్న గంటా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ''ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టు లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు...

విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి''.. అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉండడం.. నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేసే ఛాన్స్ ఉన్నా గంటా సోషల్ మీడియాకు ఎక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో హైకమాండ్ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది.

Advertisment
Advertisment
Advertisment