AP House for All Scheme: ఏపీలో ఫ్రీగా ఇళ్ల స్థలాల కేటాయింపు.. అర్హతలు ఇవే

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్లు పథకం పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్ల 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు.

New Update
Land

AP House for All Scheme

AP House for All Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్లు పథకం పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్ల 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన అర్హతలను కూడా ఉత్తర్వుల్లో తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ(TDP) కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇస్తామని ప్రకటించింది. 

ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ(Revenue Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఇక ఈ జీవో ప్రకారం చూసుకుంటే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని మహిళల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇంటి పట్టా వచ్చిన రెండేళ్లలోనే అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?

అర్హతలు ఇవే..

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్‌ డీడ్‌ ఇవ్వనుంది. ఇంటిస్థలం పట్టా వచ్చినవాళ్లకి పదేళ్ల తర్వాతనే ఆ స్థలంపై వారికి పూర్తిగా హక్కులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్‌ డీడ్‌ను జారీ చేయనున్నారు.  

అయితే ఈ స్కీమ్ కింద లబ్ధిపొందబోయే వారికి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటిస్థలం ఉండకూడదు. అలాగే సొంత ఇల్లు కూడా ఉండకూడదని కూటమి సర్కార్‌ షరతులు పెట్టింది. అంతేకాదు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో కూడా లబ్ధిదారుగా ఉండకూడదని క్లారిటీ ఇచ్చింది.  అలాగే రేషన్ కార్డు ఉండాలి. 5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లోపు మగాణి ఉండాలి. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తులు స్వీకరించనుంది. 

Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే

ఆ తర్వాత గ్రామ, వార్డు సభల్లో అభ్యంతరాలు స్వీకరించి అర్హులను నిర్ణయిస్తారు. ఇదిలాఉండగా.. ఇంటి పట్టాల పంపిణీ కోసం ఉన్న భూమినే వినియోగించాలని సర్కార్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే కొత్త భూములు కొనకుండానే ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూముల్లోనే అర్హులకు పట్టాలకు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృ‌తి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?

Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment