Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు

చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. కానీ రమేశ్ తాము అడిగిన ప్రశ్నలు వేటికీ సమాధానం ఇవ్వడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఫోన్, సిమ్ కార్డులను కూడా ఇవ్వలేదని తెలిపారు.

New Update
Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు

YCP Leader Jogi Ramesh : మీరేమైనా చేసుకోండి నాది ఒక్కటే సమాధానం...తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని అంటున్నారు మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh). రెండోసారి పోలీస విచారణకు హాజరైన రమేశ్ అసలు ఏమాత్రం నోరు విప్పడం లేదని తెలుస్తోంది. డీఎస్సీ ఆఫీసులో ఈయన విచారణ కొనసాగింది. అయితే జోగి రమేష్‌ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. మేం అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. అదే కాదు దాడి జరిగిన రోజున ఉపయోగించిన ఫోన్‌, సిమ్‌ కార్డును...మాకు ఇంత వరకు ఇవ్వలేదని డీఎస్పీ చెప్పారు. దాంతోపాటూ నిందితుడి నుంచి ఫోన్, సిమ్ కార్డు వివరాలు తీసుకోవద్దని పలు కేసులలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయని, వాటి ఉదాహరణలను రమేశ్ తాలూకా న్యాయవాది వెంకటేశ్వరశర్మ చూపించారని అన్నారు.

అయితే దీని మీద తాము సంతృప్తి చెందలేదని..మరోసారి జోగి రమేష్‌ను విచారణకు పిలుస్తామని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. మరోవైపు విచారణ తర్వాత జోగి రమేశ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇక విచారణకు రమేశ్‌తో పాటూ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ (Fiber Net) మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వరశర్మ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

Also Read: Telangana: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

త్వరగా కోలుకోవాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి. 

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment