Mohammad Siraj: అప్పుడు తిట్టినవారే ఇప్పుడు పొగుడుతున్నారు

మహ్మద్‌ సిరాజ్‌ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్‌ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్‌ సిరాజ్‌ జర్నీ.

New Update
Mohammad Siraj: అప్పుడు తిట్టినవారే ఇప్పుడు పొగుడుతున్నారు

మహ్మద్‌ సిరాజ్‌ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్‌ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్‌ సిరాజ్‌ జర్నీ. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా పర్యటనలో సిరాజ్‌ వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సిరాజ్‌ జట్టులో అవసరమా..? అతడు కాకుండా భారత్‌లో బౌలర్లే లేరా అని నెటిజన్లు బీసీసీఐపై ఆరోపణలు చేశారు.

దీంతో బీసీసీఐ శ్రీలంక టూర్‌కు వెళ్లిన భారత జట్టులో సిరాజ్‌ లేకుండా అతన్ని పక్కన పెట్టింది బీసీసీఐ. అనంతరం ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ టోర్నీలో మహ్మద్‌ షమీ గాయం కారణంటో ఆ టూర్‌కు వెళ్లకపోవడం వల్ల సిరాజ్‌కు మళ్లీ అనుకోకుండా అవకాశం వచ్చింది. అప్పుడే సిరాజ్‌లో ఉన్న ప్రతిభ బయట పడింది. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్‌లో సిరాజ్‌ తనపై చేసిన విమర్శలకు బాల్‌తో చెక్‌ పెట్టాడు. ఈ మ్యాచ్‌ సిరాజ్‌ 4 కీలక వికెట్ల పడగొట్టాడు. అనంతరం జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో సైతం సిరాజ్ కీలక వికెట్లను పడగొట్టాడు. ఇదే సమయంలో మహ్మద్‌ సిరాజ్ తండ్రి మృతి చెందాడు.

దీంతో అతను స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. కానీ తన తండ్రి తనను గొప్ప క్రికెటర్‌గా చూడాలని ఆశపడ్డాడని, తనకు ప్రస్తుతం మంచి అవకాశం వచ్చిందని, తన తండ్రి ఆశను నెవేర్చుతానని భావించిన హైదరాబాదీ పేసర్‌.. ఇండియాకు తిరిగి రాకుండా బోర్డర్‌-గవాస్కర్‌ టోర్నీలో పాల్గొన్నాడు. మరోవైపు అదే సమయంలో సిరాజ్‌కు తోటి ప్లేయర్లు అండగా నిల్చారు. బీసీసీఐ సైతం అతనికి అండగా నిలిచింది. కాగా సిరాజ్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకుంటూ తాను టీమ్‌లో ప్రధాన పేసర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

మంచి మనస్సు చాటుకున్న సిరాజ్‌

మహ్మద్‌ సిరాజ్‌ మంచి మనస్సు చాటుకున్నాడు. ఆసియా కప్‌ ఫైనల్‌లో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ డబ్బులను గ్రౌండ్‌ సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. గ్రౌండ్‌ సిబ్బంది ఆసియా కప్‌ టోర్నీ సక్సెస్‌ ఫుల్‌గా ముగించడానికి గ్రౌండ్‌ సిబ్బంది శ్రమ అధికంగా ఉందని తెలిపాడు. వారు సకాలంలో స్పందించకపోతే ఆసియా కప్‌ టోర్నీలోని భాగంగా జరిగిన మ్యాచ్‌లు విజయవంతంగా జరిగేవి కాదని, వారి కష్టానికి తన వంతుగా తనకు వచ్చిన ప్రైజ్‌ మనీని ఇస్తున్నట్లు ప్రకటించాడు. సిరాజ్‌ నిర్ణయంతో స్టేడియంలో ఉన్న ప్రముఖులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం, నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించడం వల్ల సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం.. నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. మార్నింగ్ 9.30 గంటల టైంలో సెన్సెక్స్‌ 1564 పాయింట్లతో 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లతో 23,288 దగ్గర కొనసాగుతోంది. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్‌వుతున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment