Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
విశాఖలోని ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు లేకుండా చూడాలని ఏపీ డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. వందలాది మంది సందర్శించే ఆ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని తెలిపారు. దీనిని జీవీఎంసీ పరిరక్షించాలని కోరారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు రఘునందన్ రావుకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
బీహార్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలకు జనం వణికిపోతున్నారు. పిడుగుపాటుకు 24గంటల్లోనే 25మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి నదులు ప్రవహిస్తున్నాయి. అసోంలో వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం 92 మంది మృతి చెందారు.
ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.