Weather Alert: ముంచుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
డంపింగ్ యార్డ్ కోసం స్థలాల ఎంపిక వివాదాస్పదంగా మారుతోంది. కొత్త యార్డులను ఏర్పాటు చేయడానికి స్థలం దొరకకపోవడం, ఉన్న యార్డులను తరలించడానికి అభ్యంతరం చెబుతున్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారాలు.. ప్రభుత్వాల నుంచి చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం అవసరం.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త అల్పపీడనం కారణంగా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావం దక్షిణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.
ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ప్రస్తుతం చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలోని బేల ప్రాంతంలో నమోదైంది. 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.