High BP: నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!!

రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, రాత్రిపూట తరచుగా అధిక మూత్రవిసర్జన, నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం. ఇక అధిక రక్తపోటు సహజ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

New Update
High BP: నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!!

High BP: ప్రస్తుత కాలంలో ఎంతోమంది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారం అలవాట్లే అంటున్నారు నిపుణులు. హై బీపీ సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది తీవ్రంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా దీని వలన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి. హైబీపీని సకాలంలో నియంత్రించకపోతే కిడ్నీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు వలన దృష్టి, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఇలాంటి సమయంలో దీనిని నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరంలో అధిక బీపీని ఉన్నట్లు అనేక సంకేతాలు ఉన్నాయి. ఈ సంకేతాలు చాలా వరకు నిద్రపోతున్నప్పుడు కనిపిస్తాయి. ఇది హెచ్చరిక చిహ్నంగా చూడాలని వైద్యులు చెబుతున్నారు. ఆ హెచ్చరికలు ఏంటో ఉప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బీపీ ఉంటే కానిపించే లక్షాలు ఇవే:

  • శరీరంలో అధిక రక్తపోటు ఉంటే అనేక లక్షణాలు రాత్రి నిద్రిస్తున్నప్పుడు కనిపిస్తాయి. వీటిని పదే పదే నిర్లక్ష్యం చేస్తే శరీరానికి అనేక రకాల ప్రమాదాలతోపాటు గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • ప్రస్తుతం కాలంలో నిద్ర సమస్యలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. నిద్రలేమి కూడా అటువంటి సమస్య, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒత్తిడి, ఆందోళన నిద్రను ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు సహజ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రాత్రంతా నిద్రపోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
  • ఓఅధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి అధిక BP ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని స్లీప్ అప్నియా అంటారు. ఇవి హై బీపీకి సంకేతాలు కావచ్చని నిపుణులు అంటున్నారు.
  • రాత్రిపూట తరచుగా అధిక మూత్రవిసర్జన సమస్య ఉంటే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. ఇవి అధిక రక్తపు సంకేతాలు కావచ్చు. అధిక BPమూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన మూత్రం అధికంగా వస్తుందంటున్నారు. ఈ లక్షణాలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
  • రాత్రిపూట, నిద్రలేచిన తర్వాత తలనొప్పి వస్తే అధిక రక్తపోటుకు సంకేతం. అధిక రక్తపోటు కారణంగా వచ్చే తలనొప్పి ఉదయం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి నిద్రపోయేటప్పుడు రక్తపోటు పెరుగుతుంది, ఉదయం చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి : ఉదయం వాకింగ్‌ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యానికి సమస్యలు తప్పవు..?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment