Viral Video: షాపింగ్ చేస్తున్న మహిళ బ్యాక్ పాకెట్‌లో పేలిన ఫోన్.. భయంతో పరుగులు!

బ్రెజిల్‌లో ఓ మహిళ వెనుక పాకెట్‌లో మొబైల్ పెట్టి భర్తతో షాపింగ్ చేస్తోంది. ఒక్కసారిగా ఆ మొబైల్ పేలి మంటలు ఏర్పడ్డాయి. దీంతో ఆ మహిళ వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

New Update
Viral Video brazil

Viral Video brazil Photograph: (Viral Video brazil)

Viral Video: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్(Smartphone) యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా కూడా అందరూ మొబైల్ పట్టుకునే కనిపిస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ తోనే గడుపుతున్నారు. మొబైల్ పేలిపోవడం, ఛార్జింగ్(Mobile Charging) పెట్టినప్పుడు మంటలు రావడం వంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఇలానే మొబైల్ పేలిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

భర్తతో కలిసి షాపింగ్ చేస్తుండగా..

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లో ఓ మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌కి వెళ్లి షాపింగ్ చేస్తోంది. ఆమె వెనుక పాకెట్‌లో తన మొబైల్‌ను పెట్టుకుని ఉంది. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆమె వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చుట్టూ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో వీడియో బయటకు వచ్చింది. 

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది తాజాగా జరిగిన సంఘటన కాదని, గతంలో జరిగిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మొబైల్ ఫోన్‌తో కాస్త జాగ్రత్తగా ఉండండి. వెనుక పాకెట్‌లో మొబైల్ ఫోన్ పెట్టవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral News: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

మహారాష్ట్రలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫేర్‌వెల్ పార్టీలో విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Maharashtra farewell part girl died with heart attack

Maharashtra farewell part girl died with heart attack

Viral News:  కేరింతలు,డాన్సులు, నవ్వులతో సందడిగా ఉండాల్సిన ఫెర్వేల్ పార్టీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వేదికపై ఎంతో సంతోషంగా ప్రసంగిస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. అసలు ఆఅమ్మాయికి ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ చదవండి. 

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

ఫేర్‌వెల్ పార్టీలో వీడ్కోలు 

మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. అయితే వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా BSC ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగించింది. కాలేజీలో తన అనుభవాలను, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను చెబుతూ అందరినీ ఉత్సాహపరిచింది. అప్పటివరకూ అందరినీ నవ్విస్తూ,ఎంతో యాక్టీవ్ గా కనిపించిన వర్ష ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి  తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.  అయితే వర్షకు ఎనిమిదేళ్ల వయసులో హార్ట్ సర్జరీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత గత 12 ఏళ్లగా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

telugu-news | latest-news 

Also Read: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' ట్రైలర్! నవ్వులే నవ్వులు

Advertisment
Advertisment
Advertisment