Aadhaar: ఒక్క ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు.. మీ అకౌంట్ లోకి రూ.50 వేలు!

కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు, వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది.

New Update
aadhar card loan

aadhar card loan Photograph: (aadhar card loan )

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వ స్కీమ్ అయిన  ప్రైవేట్ సంస్థలలో జాబ్ అయినా పొందలేము.  స్కూల్ అడ్మిషన్ నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రారంభించడం వరకు అన్నింటికీ ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది.  అయితే ఆధార్ కార్డుపై కూడా లోన్ పొందవచ్చు అని విషయం మీకు తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి తప్పేం లేదు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. 

కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు  వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది.  2020లో ప్రారంభించబడిన ఈ పథకంలో మీరు ఆధార్ కార్డ్ ఆధారంగా రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. దీనికి గానూ ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. అంటే  ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదన్న మాట.  

ఈ ప్లాన్ ఎలా పని చేస్తుంది?

ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద లోన్ పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. వ్యాపారులు ఈ పథకం కోసం ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత వ్యాపారులకు రూ.10,000 వరకు లోన్ ఇస్తారు. మీరు ఈ లోన్ ను  సకాలంలో చెల్లిస్తే, మీ ఆధార్ కార్డుపై రూ.20,000 వరకు లోన్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని కూడా నిర్ణీత గడువులోగా చెల్లిస్తే రూ.50 వేల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది.  కానీ 12 నెలల్లో అంటే ఏడాదిలో తీసుకున్న మొత్తం లోన్ ను వాయిదా పద్ధతిలో  తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  

ఎలా దరఖాస్తు చేయాలి? 

ఆధార్ కార్డుతో ప్రధాన మంత్రి స్వానిధి యోజన కింద లోన్ పొందడానికి, మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా pmsvanidhi.mohua.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తు చేసేటప్పుడు వ్యక్తిగత, వ్యాపార సమాచారం, ఆధార్ కార్డ్‌తో సహా మీ అన్ని వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఈ లోను తీసుకోవాలంటే  కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.   దేశవ్యాప్తంగా  లక్షలాది మంది వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనాలు పొందుతున్నారు.   ఇప్పటివరకు 80  లక్షల మంది వీధి వ్యాపారులకు ఈ పథకం కింద లోన్లు తీసుకున్నట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  

Also Read :  USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold and Silver Prices: కొండెక్కిన బంగారం....స్వల్పంగా తగ్గి.....

బంగారం ధర సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది.పెండ్లిళ్ల సీజన్‌లో బంగారం కొందామనుకున్న వారికి ధరలు నిరాశే మిగుల్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన బంగారం రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే గతంలో గరిష్టానికి చేరిన ధర స్వల్పంగా తగ్గింది.

New Update
 Gold prices

Gold prices

Gold and Silver Prices : బంగారం ధర సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది. పెండ్లిళ్ల సీజన్‌లో బంగారం కొందామనుకున్న వారికి బంగారం ధరలు నిరాశే మిగుల్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన బంగారం రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది.

Tummala Nageswara Rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్‌.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!

 గుడ్డిలో మెల్లలా  ఇటీవల జీవిత కాల గరిష్ఠానికి(తులం రూ.90 వేలు) చేరిన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా వరసగా చుక్కలు చూపిస్తున్న పసిడి ధర ఇవాళ స్వల్ప తేడాలతో యథావిధిగా కొనసాగుతోంది. అయితే గతంతో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ రూ. 90 వేలు దాటిన గోల్డ్ రేటు గత మూడు రోజుల్లో రూ.880 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డ్ స్థాయిలో రూ. 90,660కి పెరగగా.. తాజాగా ఆదివారం నాటికి రూ. 89,780కి తగ్గింది. వాస్తవానికి గోల్డ్​ ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి మరింతగా పెరుగుతాయని భావించారు. కానీ నెమ్మదిగా బంగారం, వెండి ధరలు దిగొస్తుండటంతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభిస్తున్నది. అయితే, అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ మార్కెట్లోకి తరలిస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్ సప్లై మధ్య తేడాలు కూడా ధరలు స్వల్పంగా తగ్గడానికి ఒక  కారణమని అంటున్నారు. 

Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
 
బంగారం ధర గడచిన ఏడాది కాలంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధర ఎక్కువగా పెరిగింది. హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో 24 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.86,840కి, 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.79,600కు చేరింది. అప్పటి నుంచి గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై సుంకాలు  పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడంతో బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభమైంది.  ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లు రికవరీ బాట పట్టడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు!

 సోమవారం ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,566 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.87,890 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,841 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.88,190 వద్ద కొనసాగుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధర రూ.లక్ష దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మార్కెట్ పండితులు చెబుతున్నారు.

 Also Read: Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..కోల్‌కతా- రూ.80,603, రూ.87,930, చెన్నై- రూ.80,942, రూ.88,300, బెంగళూరు- రూ.80,777, రూ.88,120, పుణె- రూ.రూ.80,713, రూ.88,050, అహ్మదాబాద్- రూ.80,813, రూ.88,160, భువనేశ్వర్- రూ.80,731, రూ.88,070, భోపాల్- రూ.80,795, రూ.88,140, కోయంబత్తూర్- రూ.80,942, రూ.88,300, పట్నా- రూ.80,667, రూ.88,000, సూరత్- రూ.80,813, రూ.88,160,  

Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?

ఇక వెండి ధరల్లోనూ స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ఆదివారం రూ.97,730 ఉండగా.. నేడు రూ.97,740కు చేరింది. ముంబైలో నిన్న కేజీ వెండి రూ.97,900 కాగా.. నేడు రూ.97,910 వద్ద కొనసాగుతోంది. అలాగే తెలుగు నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర ఆదివారం రూ.98,050 ఉండగా.. నేడు రూ.98,060కి చేరుకుంది.

Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్

Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?

Advertisment
Advertisment
Advertisment