Daughter killed father: అక్రమ సంబంధం వొద్దన్న తండ్రి.. గుండెలపై గుద్ది చంపిన కూతురు!

ఏపీ మండపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సురేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురు దుర్గను.. తండ్రి రాంబాబు మందలించాడు. వెంటనే మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రియుడు, అతని ఫ్రెండ్ తో కలిసి తండ్రిని గొంతు పిసికి చంపింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

New Update
secundrabad murder

Daughter killed father ap Illegal affair case

Daughter killed father: ఓ కూతురు చేస్తున్న పాడు పని వద్దని చెప్పినందుకు తండ్రిపై దారుణానికి పాల్పడింది దుర్మార్గురాలు. ప్రియుడితో అక్రమ సంబంధం మంచిది కాదని, మానుకోవాలని మందలించిన కన్నవాడినే కాటికి పంపింది. ప్రియుడు, మరికొంతమంది సహకారంతో హతమార్చి అనుమానస్పద మృతిగా క్రియేట్ చేసింది. అయితే స్థానికులు, మృతుడి సన్నిహితుల ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగింది.

పరువు పోతుంది మానుకోవాలని.. 

ఈ మేరకు మండపేట టౌన్‌ సీఐ దారం సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండపేటలో మార్చి 20న ఈ ఘటన చోటుచేసుకుంది. 
మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. కూతురు వెంకట దుర్గ రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు.. వెంటనే మానుకోవాలని, పరువు పోతుందని హెచ్చరించాడు.  అయితే తండ్రి మందలించిన విషయాన్ని అర్థం చేసుకోకుండా పగ పెంచుకుంది దుర్గ. దీంతో ప్రియుడితో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ చేసింది. మార్చి16న రాంబాబు ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు సురేష్‌, అతని ఫ్రెండ్ తాటికొండ నాగార్జునను ఇంటికి పిలిచింది. ముగ్గురూ కలిసి మంచంపై పడుకున్న రాంబాబు మీద కూర్చోని శ్వాస ఆడకుండా గొంతు పిసికి చంపేశారు. 

Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!

ఆ తర్వాత తండ్రి నిద్రలోనే కన్నుమూశాడంటూ తనకేమి తెలియనట్లు నటించింది. మృతుడి సోదరుడు సూరా పండు రాంబాబు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే దుర్గపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దుర్గ నిజం ఒప్పుకోగా.. నిందితులను అరెస్ట్‌ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్

today telugu news | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు

New Update
a young women

a young women

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అఖిల సోదరుడికి నిందితుడు ఆదినారాయణస్నేహితుడు. ఆమె కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడు. 

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇద్దరి మధ్య వాగ్వాదం

అయితే ఇటీవల ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయమై అతడిని యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడికి దిగాడు.  శనివారం ఇంటి ముందు బాధితురాలు బట్టలు ఉతుకుతున్న టైమ్ లో   కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్‌ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి రావడంతో  ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment