Husband killed wife: కడపలో ఘోరం.. భార్యను నరికిన భర్త.. ఏకంగా రైలు పట్టాలపై!

ఏపీ కడపలో మరో దారుణ మర్డర్ జరిగింది. అంబవరంకు చెందిన చెన్నకేశవ తన భార్య సుజాతను నరికి చంపాడు. అనంతరం అతను రైలు కిందపడి చనిపోయాడు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తుండగా.. ఈ ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రోషన్ తెలిపారు. 

New Update
murder

AP Kadapa murder Husband killed wife

Husband killed wife: ఏపీలో మరో దారుణ మర్డర్ జరిగింది. వరుస హత్యలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు వణికిపోతుండగా తాజాగా భర్త చేతిలో మరో భార్య బలైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ మొదలవగా విచక్షణ కోల్పోయిన భర్త కట్టుకున్న ఆవిడను ఘోరంగా కడతేర్చాడు. మానవత్వం మరిచి కృరమృగంలా దాడిచేసి నరికి నకిరి చంపేశాడు. ఈ ఘటన కడపలో కలకలం రేపుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.   

కత్తితో నరికి నరికి..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా వల్లూరు మండలం అంబవరం ఎస్సీ కాలనీకి చెందిన యర్రగుడి పాడు చెన్నకేశవ, భార్య సుజాత నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. స్థానికులు సర్ధిచెప్పినప్పటికీ వారు ఊరుకోలేదు. దీంతో భార్య మాటలకు కోపంతో రగిలిపోయిన చెన్నకేశవ క్షణీకావేవేశంలో సుజాతపై కత్తితో దాడి చేశాడు. ఆమెను పలు చోట్ల నరికడంతో అక్కడికక్కడే మృతి చనిపోయింది. 

Also Read: భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

అయితే భార్య సుజాత చనిపోయినట్లు గుర్తించిన చెన్నకేశవ.. దగ్గరలోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కమలాపురం సీఐ ఎస్.కె. రోషన్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భార్యను చంపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో తేలుస్తామన్నారు.

Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...

 kadapa | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gang rape: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఊరికి వెళ్లి వస్తున్న దంపతులపై దాడి చేసి 50వేల నగదు, బంగారు నగలు దోచుకున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా పరారిలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

New Update
 Gang rape

Bihar boys gang-raped on Women

Gang rape: బీహార్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఊరికి వెళ్తున్న దంపతులను రోడ్డుపై ఆపిన దుండగులు దాడి చేసి గాయపరిచడం  కలకలం రేపింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారిలో ఉన్నారు. ఈ అవమానవీయమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా..

బీహార్‌ నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన దంపతులు ఆదివారం రాత్రి తమ బంధువుల ఇంటికి వెళ్లి  బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఆ సమయంలోనే మార్గమధ్యలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని చుట్టుముట్టారు. మొదట భర్తను కొట్టి గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను కొట్టారు. వారిదగ్గరున్న 50 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరకుని నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు డిఎస్పీ గోపాల్ కృష్ణ, ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ కుమార్ పాండే తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇక బాధిత దంపతులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి.. అత్యాచారం, దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన శోభా బిఘా గ్రామ నివాసి కౌశలేంద్ర కుమార్ అలియాస్ సన్నీని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న రెండవ నిందితుడికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

bihar | gangrape | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment