IPL 2024: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. నిమిషాల్లో టికెట్లు సోల్డ్‌ అవుట్

ఈ నెల 25న హైదరాబాద్‌ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్‌ - హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్‌ అవుట్ అయ్యాయి.

New Update
IPL 2024: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. నిమిషాల్లో టికెట్లు సోల్డ్‌ అవుట్

RCB vs SRH Match Tickets Sold Out: ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. ప్రతిమ్యాచ్‌లో కూడా స్టేడియం మొత్తం క్రికెట్‌ ఫ్యాన్స్‌తో నిండిపోతుంది. ఏ రాష్ట్రంలో మ్యాచ్‌ జరిగిన టికెట్లు కొద్దిసేపట్లోనే సోల్డ్‌ అవుట్ అయిపోతాయి. అయితే ఈ నెల 25న హైదరాబాద్‌ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్‌ - హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో (Uppal) జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు.

Also Read:  తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు

ఇది పెట్టిన కొద్దినిమిషాల్లోనే టికెట్లు సోల్ట్‌ అవుట్‌ అయిపోయాయి. దీంతో కాస్త ఆలస్యంగా పేటీఎం ఓపెన్ చేసిన క్రికెట్‌ అభిమానులు మళ్లీ నిరాశే ఎదురైంది. అసల్ సన్‌రైజర్స్‌ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లను విక్రయానికి పెడుతుందో చెప్పడం లేదంటూ వాపోతున్నారు. బ్లాక్‌లో టికెట్లను అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మకుండా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: హార్థిక్ ను విమర్శించడం ఆపండి కోహ్లీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు