ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే

ఓ వైద్యుడు ఇంజక్షన్స్ ఇచ్చి భార్య పిల్లలను చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడుతున్న అరుణ్ అనే వ్యక్తి భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపి చివరకి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే

Doctor Kills Wife and Kids : అనారోగ్యంతో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు (Doctor)దారుణానికి పాల్పడ్డాడు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పసి పిల్లలను ఉన్నట్టుండి ఘోరంగా హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా యాంటీబయాటిక్ పేరుతో భార్య, పిల్లల బాడీలోకి పాయిజన్ ఇంజెక్ట్ చేసి నొప్పితెలియకుండా ప్రాణాలు తీశాడు. ప్రస్తుతం ఈ భయంకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Also read :పార్లమెంట్‌ను కూల్చి భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఖలీస్థాన్ ఉగ్రవాది

ఈ మేరకు ఉత్తరప్రదేశ్ (Utter Pradesh)లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకోగా.. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్‌ అరుణ్‌ సింగ్‌.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్‌ ప్రాంతంలో గల మోడ్రన్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (Assistant Divisional Medical Officer at Modern Rail Coach Factory)గా పనిచేస్తున్నాడు. అతడు ఒక కంటి స్పెషలిస్ట్‌. అయితే అరుణ్‌ గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్‌ ప్రియదర్శి తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆయన పలుసార్లు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించినట్లు సన్నిహితులు చెప్పారు. అయితే ఉన్నట్టుంది ఇంజక్షన్ల ద్వారా భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన అరుణ్ తర్వాత తను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment