Dilsukhnagar Bomb Blast : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. నేడే తెలంగాణ హైకోర్టు తీర్పు!

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

author-image
By Madhukar Vydhyula
New Update
Dilsukhnagar Blast

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల పాటు జరిగిన విచారణ అనంతరం రేపు తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
 
Dilsukhnagar Bomb Blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, ఈ శిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. నేడు తుది తీర్పు ఇవ్వనున్నది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో తనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

157 మంది సాక్ష్యులు..

21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

Advertisment
Advertisment
Advertisment