Telangana : మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కీలక ప్రకటన!

 ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కొత్త కార్డులు మంజూరు అయిన వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని వెల్లడించారు

New Update
ration-rice-uttam

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.  ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా కొత్త కార్డులు మంజూరు అయిన వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని వెల్లడించారు. 2025 మార్చి 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.  ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు.

Also Read :  దేశవ్యాప్తంగా ఫోన్‌  పే..గూగుల్‌ పే బంద్‌..ఎందుకో తెలిస్తే షాక్‌..

Also Read :  టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

మనిషికి 6 కిలోల చొప్పున ఫ్రీ

తెలంగాణలో 84 శాతం మందికి మనిషికి 6 కిలోల చొప్పున ఫ్రీగా సన్నబియ్యం అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే విప్లవాత్మక కార్యక్రమమని మంత్రి అభిప్రాయపడ్డారు.  ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్న ఉత్తమ్.. ఇటీవల కొత్త దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు.  ఇందులో  కుటుంబ సభ్యులను యాడ్ చేస్తున్నామని తెలిపారు.  ‘‘ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదు. రూ.8 వేల కోట్ల బియ్యం పంపిణీ జరిగితే, వాటిని లబ్ధిదారులు ఉపయోగించకపోవడంతో పక్కదారి పట్టాయి. అందుకే పేదలు కడుపునిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం” అని  బుధవారం అసెంబ్లీలో మంత్రి తెలిపారు. 

Also Read :  భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి చేసిన భర్త!

Also Read :  2027 నాటికి 23 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయ్..!

 

telangana-congress | minister-uttam-kumar-reddy | ration-cards | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhadrachalam : శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ..

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 12 వరకు కొనసాగే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
 Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 12 వరకు కొనసాగే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మండపంలో ప్రవేశానికి సెక్టార్‌ టికెట్లను ఆన్‌లైన్‌తోపాటు కౌంటర్లలో విక్రయిస్తున్నారు. 7న మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ హాజరుకానున్నారు.

రాములోరి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం రూ.2.50కోట్లతో ఏర్పాట్లు చేపట్టింది. మిథిలాస్టేడియంలో 31వేల మంది భక్తులు సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం చూసేలా తీర్చిదిద్దారు.  ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా ఫాగ్ సదుపాయాలను స్టేడియం ఆవరణలో  కల్పిస్తున్నారు. కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​చొరవతో ఏర్పాట్లు చేస్తున్నారు. 50 టన్నుల భారీ ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లను కూడా అమర్చుతున్నారు.

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

భద్రాచలం, పర్ణశాలలో భక్తులకు చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. మజ్జిగ, చల్లని తాగునీటి ప్యాకెట్లను ఇవ్వనున్నారు. భక్తుల కోసం19 ప్రసాద, 60 తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. నవమి అనంతరం పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా ప్రసాదాలు, తలంబ్రా లు పంపిణీ  చేయనున్నారు. భద్రాచలం రాలేని భక్తులకు దేవస్థానం ఆన్​లైన్​ ద్వారా పరోక్ష పూజా కార్యక్రమాలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: దోసకాయ లేదా రోజ్ వాటర్ ఏ టోనర్‌ మంచిది..?

ప్రసాదాల కొరత రాకుండా 2 లక్షల లడ్డూలు, 10వేల పెద్ద లడ్డూలను తయారు చేయిస్తుం ది. ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రైవేటు ప్రసాదాల అమ్మకాలపై నిషేధం విధించారు. ఏప్రిల్​ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే  కలెక్టర్​ఆదేశించారు. 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్​రాజ్​, ఏఎస్పీ విక్రాంత్ ​కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

Advertisment
Advertisment
Advertisment