New Ration Cards: షాకింగ్ న్యూస్.. రేషన్ కార్డుల పంపిణీ వాయిదా!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్. మార్చి 1నుంచి పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేసింది. జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ ముగియగానే పంపిణీ చేయనున్నారు.

New Update
ration cards cancel

Telangana government postponed new ration cards issuing

New Ration Cards: తెలంగాణ(Telangana) ప్రజలకు షాకింగ్ న్యూస్. మార్చి 1నుంచి పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ ముగిసిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

మార్చి 8 వరకు ఎన్నికల కోడ్..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త కార్డుల ప్రక్రియ నిలిపివేశారు. అయితే మార్చి 8న ఎన్నికల కోడ్​ ముగియనుండగా అనంతరం కొత్త దరఖాస్తులు, లబ్దిదారులకు కార్డుల ప్రక్రియ ముందుకు సాగనుంది. మరోవైపు కొత్త కార్డుల జారీకి సంబంధించి తమకు ఆదేశాలు రాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ వార్డు సభలు నిర్వహించినప్పుడే కార్డుల జారీ జరుగుతుందని, అంతకు మించి తాము ఏమీ చెప్పలేమంటున్నారు. 

Also Read: Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ

ఇక రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. అయితే పంపిణీలో ముందుగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.12 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, వికారాబాద్‌ లో 22, నాగర్‌కర్నూల్‌లో 15, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13, నారాయణపేట జిల్లాలో 12, మేడ్చల్‌ మల్కాజిగిరి, వనపర్తిలో 6 వేలు అందించనున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల కొత్త కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. 

Also Read: USA: జెలెన్ స్కీ పై విరుచుకుపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు 

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Heatwave Warning

Heatwave Warning


Heatwave Warning : ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ర్టాల్లోనూ ఈ రోజు  ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!


మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

ఇక ఏపీలోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది.శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

Advertisment
Advertisment
Advertisment