SLBC: టన్నెల్‌లోకి మరోసారి కడావర్  డాగ్స్.. 600 మంది సిబ్బందితో ఆపరేషన్!

SLBC సొరంగంలో చనిపోయిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్ లోకి పంపించినట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. 3 షిఫ్టులలో 600 మంది పనిచేస్తున్నారు.  

New Update
dlbc tnl

SLBC Tunnel Rescue Operation Cadaver Dogs Entry

SLBC: SLBC సొరంగంలో మరణించిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు.  టన్నెల్‌లోకి మరోసారి కడావర్  డాగ్స్ పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్‌ను గురువారం ఉదయం 11 గంటలకు సొరంగంలోనికి పంపినట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి (IAS) చెప్పారు. 

3 షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది..

ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి (IAS) ని నియమించింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు 34 రోజులుగా నిరంతరం సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ప్రతిరోజు3 షిఫ్టులలో 600 మంది సిబ్బంది పాల్గొంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. సహాయక బృందాల మధ్య పూర్తిస్థాయి  సమన్వయంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. టన్నెల్ ప్రమాదం జరిగిన రోజు నుంచి నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సహాయక చర్యల్లో భాగంగా సొరంగంలో ఉన్నటువంటి మట్టిని, టీబీఎం భాగాలను, ఊట నీటిని తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. 

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

టన్నెల్ లోపల వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నాం. నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నాం. సహాయక చర్యలలో పాల్గొంటున్న సహాయక సిబ్బందికి కావలసిన ఆహరం, వసతి, ఆరోగ్యం తదితర  సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. 

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

tunnel | telangana | telugu-news | today telugu news 

#telugu-news #telangana #slbc #tunnel #today telugu news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

HCU వివాదంపై సర్కార్ సంచలన ప్రకటన!...

HCU వివాదంపై సర్కార్ సంచలన ప్రకటన!

HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు.

New Update
hcu

HCU Hyderabad

HCH:HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు. గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్‌ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందినది లేదన్నారు.

వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే..

ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వం ఇక్కడ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘2003 జనవరి 13న నాటి ప్రభుత్వం ఐఎంజీ అకడమీస్‌ భారత ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మెమో నం.39612/ఏఎస్‌ఎస్‌ఎన్‌/వి(2) 2003 ప్రకారం కంచ గచ్చిబౌలి గ్రామంలోని భూమిని కేటాయించింది. ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న కేటాయింపును రద్దు(నం.111080/ఎస్‌1/2003) చేసి ఏపీ యూత్‌ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంటుకు కేటాయించింది' అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

మరోవైపు ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

 

 

: land | cm revanth | sridhar-babu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment