TS: వారికే రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల చేసిన రేవంత్ సర్కార్!

రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. 

author-image
By Manogna alamuru
New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

వ్యవసాయాన్ని పెంచేందుకు, రైతులకు లాభం కూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను అనౌన్స్ చేసింది. రైతులు పెట్టే పెట్టుబడులకు సాయం చేస్తామని చెప్పింది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటూ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించడానికి, అవసరమైన వనరులు సేకరించడానికి కూడా హెల్ప్ చేస్తామని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతు భరోసాలో మార్పులు చేసింది. 

ఎకరాకు 12 వేలు..

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మారిన రైతు భరోసాను ఈ నెల 26 నుంచి అమలు చేయనుంది. దీనిప్రకారం పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు 12వేలుకు పెంచింది. భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ భూములున్న వారందరికీ దీనిని ఇవ్వనుంది. అలాగే వ్యవసాయం యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది. ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఆర్‌బీఐ నిర్వహించే డీబీటీ (DBT) పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది. 

 

 

 

Also Read: HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment