/rtv/media/media_files/2025/02/24/EocNLUBufWAoBoSWtG1Z.jpg)
Rat Hole Coal Mining
SLBC : శ్రీశైలం టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. గత రెండ్రోజులుగా 8 మంది బాధితులు సొరంగంలోనే ఉండిపోయారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియటం లేదు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీంలు రెస్క్యూ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. టన్నెల్ లోపల భారీగా బురద, నీరు ఉండటంతో బాధితుల వద్దకు వెళ్లటం కష్టంగా మారింది. అయినా ప్రభుత్వం వీలయినన్నీ మార్గాల ద్వారా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్స్ మైనర్స్ను రంగంలోకి దించింది.
Also Read: US JOBS-Trump: 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్!
ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకొన్నారు. ఈ రాత్రికే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. ర్యాట్ హోల్స్ మైనర్స్ ద్వారా బాధితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా 17రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు. ఎస్ఎల్ బీసీ వద్దకు చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. టన్నెల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ఎండోస్కోపిక్, రోబోటిక్ కెమెరాలను పంపి పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు.
ఇది కూడా చదవండి: ఆ పార్టీకి గతమే.. ఇక భవిష్యత్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి
ర్యాట్ హోల్ మైనర్స్ అంటే?
ర్యాట్ హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విధానం. భారీ బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీయడానికి సమాంతరంగా సన్నని గుంతలు తవ్వే విధానాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అని అంటారు. సింపుల్గా, అర్థం అయ్యేలా చెప్పాలంటే ఎలుకలు రంధ్రం చేసే విధంగా అన్నమాట. భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్గా చెబుతుంటారు. నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో ఒక్క మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది. ఈ విధానం ద్వారా భూమి పైనుంచి లేదా సమాంతరంగా సన్నని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకొని.. గనుల్లో బొగ్గు పొరను చేరుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
ఇది కూడా చదవండి: YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్!
ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు. రోప్లు, నిచ్చెనల సాయంతో కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు. మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ విధానంతోనే కార్మికులను రక్షించారు. 41మంది కార్మికులు 17రోజుల పాటు సొరంగంలో చిక్కుకోగా.. ఈ ర్యాట్ హోల్ మైనర్లు కేవలం ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడిదే విధానంతో ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కాసేపట్లో బాధితులు చిక్కుకున్న ప్రాంతంలో భూమి పైపొర నుంచి ర్యాట్ హోల్ విధానంలో మైనర్లు రెస్క్యూ ప్రారంభించనున్నారు. ఈ విధానంతో బాధితులు సురక్షితంగా బయటపడాతరని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పులివెందుల ప్రజలకు జగన్ గుడ్ న్యూస్.. ఎల్లుండే ప్రారంభోత్సవం!