/rtv/media/media_files/2025/01/03/N4ZYFsmHNKBP5Ig8D0Ap.jpg)
MLC Kavita
బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బీసీ మహాసభలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవత్ సర్కార్ను డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ రిపోర్టును ఇప్పుడు బీరువాలో పెట్టారంటూ విమర్శించారు. మండల్ కమిషన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
Also Read: ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎప్పుడూ కూడా అన్యాయమే జరిగిందని మండిపడ్డారు. ఇది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ విసిరారు. '' దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా బీసీల వాస్తవ లెక్కలు బయటకు తీయాలి. కులం ఆధారంగా రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. బీసీల కోసం పనిచేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కూడా బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు. రాజీవ్ గాంధీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని అన్నారు.
Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఐఎండీ కీలక ప్రకటన
2011 కులగణన చేసిన నివేదికను అప్పటి UPA ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా ఈ రిపోర్టును బయటపెట్టలేదు. తాము కులగణన చేయమని ఇప్పటికే బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేశాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు అండగా ఉన్నాయి. వారికి న్యాయం చేశారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులే బీసీల వైపు నిలబడి న్యాయం చేశారని '' కవిత అన్నారు. అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన బీసీ మహాసభ వేదికగా 4 తీర్మానాలను ప్రవేశపెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 3, 2025
•మహాత్మా జ్యోతిబా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలి.
•కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన లోనే కులగణన కూడా చేయాలి.… pic.twitter.com/G2Yk6rvkmV
Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు!
Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్కు.. నెక్ట్స్ ఇండియాకు?
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు