Telnagana: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన.. కార్డు లేకున్నా..!

కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తామని తెలిపారు.

New Update
Uttam

Uttam Kumar reddy

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది పండుగ రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని తెలిపారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. '' తెలంగాణలో 85 శాతం జనాభాకు సన్నిబియ్యం అందనుంది. చాలామంది ప్రజలు రేషన్ బియ్యాన్ని వాడటం లేదు. దొడ్డు బియ్యం తినకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.      

Also Read: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన

బియ్యంతో పాటు త్వరలో పప్పు, ఉప్పు లాంటి వంట సరకులు అందిస్తాం. రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా రేషన్ బియ్యం తీసుకునేలా ఏర్పాటు చేశాం. కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నాం. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తాం. రేషన్ బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతీ సంవత్సరం రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని'' ఉత్తమ్ చెప్పారు.

Also Read: అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన!

ఇదిలాఉండగా.. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఇంటిస్థలం లేని అర్హులకు ఇళ్లు కేటాయించాలి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే అంసపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రానట్లయితే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ఇక పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు మొదటి విడుతలో రూ.లక్ష చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 

Also Read: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!

Also Read: కుణాల్‌ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

uttam-kumar-reddy | rtv-news | ration-cards 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori: అఘోరీని పరిగెత్తించి కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్

సూర్యపేటలో అఘోరీపై దాడి జరిగింది. ఓ యువకుడు తల్వార్‌తో అఘోరీపై దాడి చేశాడు. అఘోరీ కూడా అతడిపై దాడికి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం స్థానికులు ఆ గొడవను ఆపి.. అక్కడ నుంచి అఘోరీని పంపించేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ వైరలవుతోంది.

New Update
aghori attacks

aghori attacks

రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంపై దాడి జరిగిన సమయంలో దర్శనమిచ్చింది. బట్టల్లేకుండా బయటకు రావడంతో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే ఓ యువతిని తనవెంట తీసుకెళ్ళి మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన బీటెక్ స్టూడెంట్ వర్షిణీని తన శిష్యురాలిగా మీడియాకు పరిచయం చేసింది. అప్పటి నుంచి మరింతగా వార్తల్లోకి ఎక్కింది. ఆ యువతితో ఇప్పుడు పలు ఆలయాలను దర్శనమిస్తుంది. తన కూతురిని మాయ చేసి.. మంత్రించి అఘోరీ తనతో తీసుకెళిపోయిందని ఆ యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా వర్షిణి అన్న హర్ష సైతం అఘోరీపై సంచలన ఆరోపణలు చేశారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

అఘోరీ తన చెల్లి వర్షిణిపై మంత్రాలు చేసి వశపరచుకుందని అతడు తెలిపాడు. తమ ఇంట్లో అఘోరీ రెండు వారాలు ఉందని.. ఆ సమయంలో రోజూ ఆల్కాహాల్ తాగేదని.. సిగరెట్లు కాల్చేదని.. ఆఖరికి కండోమ్ ప్యాకెట్లు సైతం తీసుకురమ్మనేది అని అతడు ఆరోపించాడు. ఇలా ఇప్పుడు అఘోరీపై వర్షిణీ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు చేసింది.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అఘోరీపై దాడి 

ఇదిలా ఉంటే అఘోరీపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సూర్యపేటలో ఆమెపై ఓ యువకుడు దాడికి ప్రయత్రించాడు. అఘోరీ మెడ పట్టుకుని గుంజేశాడు. చుట్టూ ఉన్నవారు ఎంత ఆపినా.. ఆ యువకుడు ఆగలేదు. అదే సమయంలో అఘోరీ సైతం ఆ యువకుడి షర్ట్ కాలర్ పట్టుకుంది. ఇద్దరూ ఫేస్ టు ఫేస్ దాడి చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ఇక అక్కడితో ఆగని ఆ యువకుడు తల్వార్ తో అఘోరీపైకి వెళ్లాడు. అఘోరీ కూడా తన కారులో ఉన్న ఒక కర్రతో అతడిపై దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిద్దరినీ ఆపి.. అఘోరీని అక్కడ నుంచి పంపించేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. ఇది పాత వీడియో.. కానీ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(aghori videos | Lady Aghori Attack | latest-telugu-news | telugu-news | viral-video )

Advertisment
Advertisment
Advertisment