Seethakka: మీ కపట ప్రేమ గురించి ప్రజలకు తెలుసు: హరీష్ రావుకు సీతక్క కౌంటర్!

బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్ల అధికారంలో కోటీశ్వరులకు కొమ్ము కాసిన కపట ప్రేమికులు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు దొంగ ప్రేమ గురించి అందరికీ తెలుసని, ఇకనైనా నాటకాలు ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు. 

New Update
seethakka

Haris Rao, Seethakka

Seetakka: బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏకాన ఇవ్వకుండా కోటీశ్వరులకు కొమ్ము కాసిన బీఆర్ఎస్ నాయకులు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాల‌కు ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా అందిస్తుంటే.. ఇప్పుడు హరీష్ రావు డిమాండ్ చేయడం హాస్యప్పదమన్నారు. క‌ష్టజీవుల‌ను విస్మరించి, అపోహ‌లు వీడి కూలీల‌కు మంచి చేసే ప‌థ‌కాన్ని ప్రశంసించండి అంటూ హ‌రీష్ రావుకు కౌంట‌ర్ ఇచ్చారు. భూమి లేని ఉపాధి కూలీల‌కు భ‌రోసా క‌ల్పించే ఉద్దేశంతో ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 

త‌ప్పుడు గ‌ణంకాల‌తో అపోహ‌లు సృష్టించి..

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధీ కూలీల‌కు రెండు ద‌ఫాల్లో ఏడాదికి రూ.12 వేల ఆర్థిక స‌హాయం అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆద‌ర్శంగా నిల‌వ‌బోతుంది. యావ‌త్ దేశం ఈ స్కీం ప‌ట్ల ఆస‌క్తి చూపుతుండ‌గా.. తెలంగాణ‌లోని కొన్ని రాజ‌కీయ శ‌క్తులు ఈ ప‌థ‌కంపై త‌ప్పుడు గ‌ణంకాల‌తో అపోహ‌లు సృష్టించే ప్రయ‌త్నం చేస్తున్నారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూలీల‌కు ఏకాన ఇవ్వని నేతలు ఇప్పుడు వారిపై క‌ప‌ట ప్రేమ న‌టిస్తున్నారు. రూ.500 కోట్ల ఆస్తులున్న వారికి సైతం రైతు బంధు ఇచ్చి..రెక్కల కష్టం తప్ప ఏలాంటి ఆస్తి పాస్తులు లేని కూలీల‌ను ప‌ట్టించుకోలేదని మండిపడ్డారు. 

ఓర్వలేక అక్కసు వెల్లగ‌క్కుతున్నారు..

ఇప్పుడు కూలీల‌కు ఆర్థిక చేయుత‌నందిస్తుంటే చూసి ఓర్వలేక అక్కసు వెల్లగ‌క్కుతున్నారన్నారు. భూమిలేని ఉపాధి హ‌మీ రైతు కూలీల‌కు ఏడాదికి రూ.12 వేలు అని మేనిఫెస్టోలో కాంగ్రెస్  స్పష్టంగా హ‌మీ ఇచ్చింది. ఇచ్చిన హ‌మీకి క‌ట్టుబ‌డి ఏలాంటి భూమిలేని ఉపాధి హ‌మీ కూలీల‌కు ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ఇస్తున్నాం. ఆస‌రా పెన్షన్లతో స‌హా అన్ని ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాలు కుటుంబం యునిట్ గా అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కానికి సైతం అదే నిబంధ‌న వ‌ర్తిస్తోందని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న MGNREGA పోర్టల్ అధికారిక లెక్కల ప్రకారమే.. 2023-24 ఆర్దిక సంవ‌త్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 48,13,966 జాబ్ కార్డులు క‌లిగిన కుటుంబాలున్నాయి. ఇందులో 22.64 ల‌క్షల కుటుంబాలు క‌నీసం ఒక్క రోజు కూడా ఉపాధి ప‌నుల్లో పాల్గోన‌లేదు. కేవ‌లం జాబ్ కార్డు క‌లిగి ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా ప‌రిగ‌ణించ‌లేము. కూలీ ద్వారా జీవ‌నోపాధి పొందితేనే ఉపాధి కూలీగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. తెలంగాణ‌లో పేరుకు 48,13,966 జాబ్ కార్డులు క‌లిగిన కుటుంబాలు ఉన్నప్పటికీ. అందులో క‌నీసం ఒక రోజు ఉపాధీ హ‌మీ ప‌నుల్లో పాలు పంచుకున్న కుటుంబాలు 25.50 ల‌క్షల వ‌ర‌కు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: Tia Billinger: వందలు కాదు వేలల్లో రండిరా..12 గంటల్లో 1057మందితో శృంగారం.. ఇదిగో వీడియోలు!

ఇక కనిష్టంగా 20 రోజుల పాటు ఉపాధి కూలీగా ప‌ని చేసిన‌ కుటుంబాలనే.. ఉపాధి హ‌మీ ఆధారిత‌ కుటుంబాలుగా ప‌రిగ‌ణించ‌డంతో సుమారు 17.26 ల‌క్షల వ‌ర‌కు కుటుంబాలే 20 రోజుల ప‌నిని పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో 11 ల‌క్షలకు పైగా కుటుంబాల‌కు సొంత భూమి ఉండ‌టంతో రైతు భ‌రోసా ల‌బ్దిదారులుగా ఉన్నారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి భూమి లేని 6 ల‌క్షల‌కు పైగా ఉపాధి కూలీ కుటుంబాలుంటాయ‌న్న అంచ‌నాలతో ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీరితో పాటు అర్హత ఉన్న అన్ని కుటుంబాల‌కు ఈ ప‌థ‌కాన్ని విస్తరిస్తామని చెప్పారు. 

ఇది కూడా చదవండి: UGC-NET: యూజీసీ- నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

గ‌త పాల‌న‌లో మాదిరిగా ఏక‌ప‌క్ష నిర్ణయాల‌తో, రాజ‌కీయ ప‌క్షపాతంతో వ్యవ‌హ‌రించ‌కుండా.. గ్రామ స‌భ‌ల్లోనే, ప్రజ‌ల స‌మ‌క్షంలోనే ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ల‌బ్దిదారులు గుర్తించ‌బ‌డుతారని చెప్పారు. గ్రామ స‌భ‌ల నిర్ణయాల‌కు గౌర‌వం ఇస్తూ ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాకు అర్హత ఉన్న అన్ని ఉపాధి కూలీ కుటుంబాల‌కు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక చేయుతనిచ్చి అండ‌గా ఉంటామన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు