Seethakka: మావోయిస్టుకు నివాళి అర్పించిన సీతక్క.. జ్ఞాపకాలు తలచుకుంటూ కన్నీళ్లు!

మాజీ మావోయిస్టు అమరుడు, తన భర్త కుంజా రామును తలచుకుంటూ మంత్రి సీతక్క కన్నీరుపెట్టుకున్నారు. మహబూబాబాద్‌ మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆ నైతికతతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
seetakka ramu

Minister Seethakka pays tribute to Maoist and her husband Ramu

Seethakka: మాజీ మావోయిస్టు అమరుడు, తన భర్త కుంజా రామును తలచుకుంటూ మంత్రి సీతక్క కన్నీరుపెట్టుకున్నారు. మహబూబాబాద్‌ మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆ నైతికతతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. 

ఆయన ఆశయాల సాధనే నా కర్తవ్యం..

ఈ మేరకు 'కుమ్రాం భీమ్ ఆదర్శాలను నమ్మి, ఆదివాసీ హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన నా భర్త , ఉద్యమ మిత్రుడు కామ్రేడ్ కుంజ రాము 21వ వర్ధంతి సభలో పాల్గొని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం భావోద్వేగం కలిగించింది. రాము చూపిన మార్గంలోనే, ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ, పేద, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతా. ఆయన ఆశయాల సాధనే నా కర్తవ్యం. రాము గారి జ్ఞాపకానికి శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా' అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు సీతక్క.

Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో కుంజా రాము వర్ధంతి సభ నిర్వహించారు. సీతక్క కొడుకు, కోడలు సూర్య, కుసుమాంజలితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాము స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రాము తన 17 ఏళ్ల వయసులోనే ఉద్యమబాట పట్టారు. పలు పోరాటాల్లో కీలక భూమిక పోషించారు. తుది శ్వాస వరకు అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసమే పరితపించారు. నేను ఉద్యమంలో పనిచేసిన సమయంలో రాము నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. సీతక్క ఏడుస్తుంటే గాయని విమలక్క ఆమెను ఓదార్చుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఉద్యమాలపై రాము పాడిన పాటల సీడీని విమలక్క ఆవిష్కరించారు. 

Also Read: Kissik Song: 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో.. సెట్ లో బన్నీ, రష్మిక, సుకుమార్ ఎలా చేశారో చూడండి!

 warangal | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment