Medchal: వదినను నేను చూసుకుంటా.. అన్నయ్యను చంపేస్తా: తల్లికి చెప్పి మరీ నరికిన సోదరుడు!

మేడ్చల్‌ సోదరుల మర్డర్‌ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మద్యానికి బానిసైన ఉమేశ్ తరచూ భార్య, తల్లిని కొట్టేవాడు. ఉమేశ్ టార్చర్ భరించలేక తమ్ముడు రాకేశ్ తన అన్నను చంపుతానని తల్లికి చెప్పాడు. వదినను తాను చూస్కుంటానని హామీ ఇచ్చి మరీ నరికి చంపాడు.

New Update
Medchal Brothers Incident Case Mother Revealed Facts

Medchal Brothers Incident Case Mother Revealed Facts

తెలంగాణ (Telangana) లోని మేడ్చల్‌లో బస్ డిపో ముందు ఆదివారం దారుణ హత్య (Killed) జరిగింది. ఉమేశ్ అనే వ్యక్తిని సోదరులే నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. 

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

ఉమేశ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అదే క్రమంలో తన భార్య, తల్లిని కొట్టేవాడు. ఇలా తరచూ ఫ్యామిలీని టార్చర్ చేస్తూ ఉండేవాడు. సోదరులు ఎంత చెప్పినా అన్న ఉమేశ్ వినేవాడు కాదు. దీంతో సోదరులకు ఓపిక నశించింది. అన్నను చంపేస్తామని తమ్ముడు రాకేశ్ ముందుగానే తన తల్లికి చెప్పాడు. 

వదినను నేను చూసుకుంటా

తర్వాత ఏది అయితే అది అవుద్దని.. వదినను నేను చూసుకుంటానని రాకేశ్ హామీ ఇచ్చాడు. అనంతరం నిన్ను చంపుతానంటూ రాకేశ్ తన అన్నకు ఫోన్ చేశాడు. ఇక చెప్పినట్లుగానే అన్నను కసితీరా నరికి చంపాడు. ఉమేశ్‌ను వేటాడి, వెంటాడి మరీ నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై అక్కడ నుంచి పరారయ్యాడు.

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

ఎలా హత్య చేశారంటే?

నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అన్నదమ్ములే అతని పాలిట కాలయముడిలా మారారు. ఈ ఘటన మేడ్చల్‌ నగర శివారులోని బస్‌ డిపో దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఉమేశ్‌ను కత్తులతో నరికి సోదరులు హత్య చేశారు. ఉమేశ్‌ను కింద పడేసి కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment