Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు స్మితా సబర్వాల్ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.

New Update
 Smita Sabharwal

Smita Sabharwal

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడిని ప్రపంచ దేశాలన్ని ఖండించాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడికి నిరసనగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు.దేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు, సామాన్యులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని హెచ్చరించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ దాడిని హేయమైన చర్యగా పరిగణిస్తూ ఆమె ఖండించారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

అయితే.. స్మితా సబర్వాల్ ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియా పోస్టులు.. కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆమె ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్మితా సబర్వాల్ తీరుపై కీలక కామెంట్స్ చేశారు. ఐఏఎస్ అధికారిణిగా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టటం సరికాదని అన్నారు. దాన్ని కన్నా రాజకీయాల్లో చేరితో సరిపోతుంది కదా అని చురకలు అంటించారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment