/rtv/media/media_files/2025/04/24/7eYQdQSYbDZzNSaEvc3K.jpg)
Wear black bands
పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.
पहलगाम के आतंकी हमले के सिलसिले में मेरी अपील: कल जब आप नमाज़-ए-जुम्मा पढ़ने जायेंगे तो आपने बांह पर काली पट्टी बांधकर जाएँ। इस से हम यह पैग़ाम भेजेंगे की हम भारतीय विदेशी ताक़तों को भारत के अमन और इत्तेहाद को को कमजोर करने नहीं देंगे। इस हमले की वजह से शर-परस्तों को हमारे… pic.twitter.com/r6uYdzQiOf
— Asaduddin Owaisi (@asadowaisi) April 24, 2025
అన్యాయానికి వ్యతిరేకంగా
" కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం. కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు.
Also Read : ఆయుధాలతో శ్రీనగర్లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్
KTR: ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. రేవంత్ కు ఇదే నా సవాల్!
ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టిస్తున్నారని ఈడీ విచారణ అనంతరం చెప్పారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు.
ktr, supreme court Photograph: (ktr, supreme court)
KTR: ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీక కక్షతోనే తనపై కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు.
రేవంత్ పై ఏసీబీ, ఈడీ కేసులు..
ఈ మేరకు సీఎం రేవంత్ పై ఏసీబీ, ఈడీ కేసులున్నాయి కాబట్టే తనను ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. తాను పైసా తప్పుగా ఖర్చు చేయలేదని, త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు. విచారణకు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసింది. ఆ పది కోట్లు కాంగ్రెస్ ప్రకటించిన పథకాలకు ఖర్చు చేసుకుంటే బాగుంటుంది. రేవంత్ కు నిజాయితి ఉంటే ఏ జడ్జీ ఎదుటనైనా కూర్చుందాం. అక్కడ తేల్చుకుందాం. నేను డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. ఏసీబీ, ఈడీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయి. ఇదంతా సీఎం కక్ష సాధింపు చర్యలో భాగమే. నేను నిజాయితి పరుడిని ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా. రేవంత్ కు నాకు డిటెక్టర్ టెస్టు పెట్టండి. టైమ్ ప్లేస్ రేవంత్ చెబితే నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: Shirdi Accident: షిరిడీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
ఇదిలా ఉంటే.. గురువారం కేటీఆర్ ను ఈడీ విచారించింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలానికి చేరకున్న కేటీఆర్ను విచారణ బృందం చాలా ప్రశ్నలు అడిగింది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!
ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులోనే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే గురువారం జరిపిన విచారణలో ప్రధానంగా నగదు బదిలీపైనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. రూల్స్ పాటించకుండా ఇండియన్ కరెన్సీని పౌండ్లలోకి మార్చి పంపించడం, హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపు, నిధుల బదలాయింపులో ఫేమా నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి సుదీర్ఘంగా కూపీలాగినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా బషీర్బాగ్ ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు.
Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
నాకు మంత్రి పదవి.. అద్దంకి సంచలన ఇంటర్వ్యూ!
కేసీఆర్ బహిరంగ సభలకే వస్తాడని.. బయటకు రాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అద్దంకి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Aghori First Wife: అఘోరీని ఉరి తియ్యండి.. వాడికి భయంకరమైన శక్తులు- మొదటి భార్య సంచలన నిజాలు!
అఘారీ మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరీకి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Maoists Surrenders : మావోయిస్టులకు షాక్...13 మంది లొంగుబాటు
వరుస ఎన్కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!