తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం.. KCR సంచలన వ్యాఖ్యలు

ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి, కొందరు నాయకులు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరారు. వారితోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ లీడర్ తాటికొండ రాజయ్య ఉన్నారు.

author-image
By K Mohan
New Update
KCR rajaiah

KCR rajaiah Photograph: (KCR rajaiah)

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని సీఎం కేసీఆర్ అన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని గులాబీ నేత ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత సమక్షంలో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ నాయకులు, ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిలతోపాటు మరి కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే

ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ ఉప ఎన్నిక వస్తుంది. అందులో కడియం శ్రీహరి ఓడిపోయి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్‌లో చేరుతారని రాజయ్య తెలపారు.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment