Software Engineer:  గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!

హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌ పరిధిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దేవిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల క్రితమే సతీష్ అనే వ్యక్తిని గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

New Update
hyderabad crime

hyderabad crime

Hyderabad :  ఆరునెలల క్రితం గోవా (Goa) లో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి,  ఓ మంచి అపార్ట్మెంట్ లో కాపురం, భార్య భర్తలిద్దరికీ  ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం.  అబ్బా.. ఎంత హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు కదా? కానీ  ఇంతలోనే  కథ ఊహించని మలుపు తిరిగింది.  పెళ్ళైన ఆరునెలలకే అమ్మాయి ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయింది (Suicide). ఈ విషాదకర ఘటన  హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని  అపార్ట్​మెంట్​ లో  చోటుచేసుకుంది. 

Also Read :  అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్లైఓవర్ కింద ఎగసిపడుతున్న మంటలు!

ఆరునెలల క్రితం ప్రేమ పెళ్లి

వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక, మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఒకే సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు (Software Employees) గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరువైపు కుటుంబాలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా పెళ్లి  చేసుకున్నారు.

Also Read :  సర్పంచ్ హత్య.. మంత్రి రాజీనామా!

ఇంతలోనే గొడవలు.. 

ఆ తర్వాత  రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని ఓ అపార్ట్​మెంట్​ లో కాపురం పెట్టారు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే భార్య భర్తలిద్దరి మధ్య మస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీష్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన దేవిక గదిలోకి వెళ్లి  గడియ పెట్టుకుంది. ఆ తర్వాత సతీష్ కూడా బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగి వచ్చాడు. 

Also Read :  బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన

అర్థరాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని 

ఇంటికొచ్చిన సతీష్  దేవిక గది తలుపులను పెట్టి ఉంచడంతో .. నిద్రపోయిందనుకొని సతీష్ మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మరోసారి భార్య తలుపు తట్టాడు. అప్పటికి కూడా దేవిక స్పందించలేదు. పని మనిషి వచ్చాక తలుపు కొట్టినా తీయలేదు. ఆ తర్వాత 10 గంటలకు ఆఫీస్ కి వెళ్లాల్సి ఉండగా, అప్పటికీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ తలుపు బద్దలు కొట్టి చూడగా.. దేవిక ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది. అనంతరం ఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త సతీష్ కట్న వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: Ramayana: షాకింగ్ న్యూస్.. 'రామాయణ' నుంచి ఆ స్టార్ నటి అవుట్.. కారణం ఇదేనా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment