రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి

నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. జనవరి 28న షరతులతో దీక్ష జరుపుకోవచ్చని చెప్పింది. 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్‌ భావించిన సంగతి తెలిసిందే. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ హైకోర్టుకు వెళ్లింది.

New Update
high court TG

high court TG Photograph: (high court TG)

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలనుకున్న రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండలో రైతు దీక్ష పేరుతో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి ఆ ధర్నాకు పర్మిషన్ రాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

జనవరి 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్‌ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్‌ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment