Formula E-race: కేటీఆర్‌కు మరో బిగ్ షాక్.. మరోసారి విచారణ!

కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఫార్ములా ఈ రేసు కేసు కీలక దశకు చేరుకుంది.‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను మరోసారి విచారిం చేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని ప్రశ్నించనున్నారు. 

New Update
KTR

KTR

Formula E-race: కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఫార్ములా ఈ రేసు కేసు కీలక దశకు చేరుకుంది.‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ వారంలోనే సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ సీఈ బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. 

నలుగురి స్టేట్‌‌‌‌మెంట్ల ప్రకారం..

అయితే ఈ ముగ్గురిని ఈ వారం రోజుల వ్యవధిలోనే విచారించనున్నట్లు సమాచారం. HMDA నిధుల దుర్వినియోగంపై జనవరి 8న సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, 9న కేటీఆర్‌‌‌‌,10న హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డ్‌‌‌‌ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌రెడ్డిని జనవరి నెల18న గ్రీన్‌‌‌‌కో ఏస్‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌జెన్‌‌‌‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌‌‌‌కుమార్ ను విచారించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురి స్టేట్‌‌‌‌మెంట్ల ప్రకారం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను సేకరించారు.

కేటీఆర్‌‌ ప్రధాన సూత్రధారి..

ఇక తాజాగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను శుక్రవారం వర్చువల్‌‌‌‌గా ప్రశ్నించగా ఎఫ్‌‌‌‌ఈవో సీఈవోను జూమ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా అర్వింద్‌‌‌‌కుమార్, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి, ఈవెంట్‌‌‌‌ ఆర్గనైజర్స్‌‌‌‌ ఏస్‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌ జెన్‌‌‌‌, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులంతా కేటీఆర్‌‌ ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపుల డాక్యుమెంట్లను సేకరించినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ముగ్గురిని మరోసారి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌, హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు రికార్డుల ఆధారంగా ఏసీబీ సమాచారం సేకరిస్తోంది. 

Also Read: Ukraine: మా ఆవేదనను వినండి-జెలెన్ స్కీ

ఇక ఈ కేసులో ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అందించిన వివరాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ వ్యవహారంలో తన పర్సనల్ ప్రయోజనం ఏమీలేదని, అంతా కేటీఆర్‌‌‌‌ చెప్పినట్లే చేశానని అర్వింద్‌‌‌‌కుమార్‌‌ ఏసీబీ ముందు ఓపెన్ అయ్యాడు. 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 25న ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఏస్‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌ జెన్‌‌‌‌ల మధ్య జరిగిన ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌‌‌‌ అమలులో ఉండగానే 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10న ఎంఏయూడీ, ఎఫ్‌‌‌‌ఈవో మధ్య జరిగిన అగ్రిమెంట్ల వివరాలు, ఫ్రూప్స్ ఏసీబీకి అందించడం సంచలనం రేపింది. 

Also Read: Ukraine: మా ఆవేదనను వినండి-జెలెన్ స్కీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య

ములుగుజిల్లా వాజేడు మండలంలో గిరిజన యువకుడి హత్య సంచలనం సృష్టించింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్య గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

New Update
murder

murder

Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో గిరిజన యువకుడి హత్య సంచలనం సృష్టించింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.విజయ్‌ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. విజయ్ తలపై గొడ్డలితో దాడిచేసి అతన్ని అతి దారుణంగా హత్య చేశారు. జరిగిన ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయ్ శవాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సంఘటన స్థలంలో రక్తపు వరదల ప్రవహించడంతో హత్య ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

సమాచారం అందుకున్న వెంటనే వెంకటాపురం సీఐ బండార్ కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్ష, పాత వైరం లేదా ఇతర కారణాలు ఈ హత్యకు దారితీసాయా అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ హత్యతో టేకులగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. మృతుడు విజయ్‌కు గ్రామంలో మంచి పేరు ఉందని, అతడు ఎవరితోనూ గొడవపడే స్వభావం లేనివాడని స్థానికులు చెబుతున్నారు. అతని హత్యపై పలు అనుమానాలు వెలువడుతున్నాయి. 

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

పోలీసులు ఈ హత్యకు సంబంధించి కొన్ని కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఇప్పటికీ దుండగులెవరు అన్న విషయం తెలియరాలేదు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ దారుణ హత్యతో ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాసం విజయ్ మరణం అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. నిందితులు త్వరగా పట్టుబడి కఠిన శిక్షలు పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read :  ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

Advertisment
Advertisment
Advertisment