Breaking: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం...కర్రలతో కొట్టుకున్న నాయకులు!

నాంపల్లిలో కాంగ్రెస్‌ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత రమేశ్‌ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు కార్యాలయం ముట్టడికి వచ్చారు.దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు.

New Update
bjpoffice

bjp office

Big Breaking: నాంపల్లిలో కాంగ్రెస్‌ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ పై ఢిల్లీకి చెందిన నేత బీజేపీ నేత రమేశ్‌ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు.

Also Read: Movies:ధనుష్ తర్వాత చంద్రముఖి మేకర్స్..నయనతారకు మరోసారి లీగల్ నోటీసులు

అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తుల బీజేపీ కార్యాలయం పైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్‌ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. 

Also Read: CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల సీరియస్ రియాక్షన్

Also Read: Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్‌

జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదనిసంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

New Update
Jeevan Reddy Vs MLA Sanjay Kumar

Jeevan Reddy Vs MLA Sanjay Kumar

కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓ న్యాయం.. మిగతా వారందరికీ మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పలేదా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వెంట తిరిగి అనుకూలంగా పని చేసిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, డీసీసీ ఛైర్మన్లు సహా చాలా మందిని కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి చేర్చుకున్నారంటూ ఆరోపించారు.తాను చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లు చేస్తే తప్పన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పారని, మరి మీ స్థానంలో కొత్త నాయకత్వం రావొద్దా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి నీతులు చెప్పాలని అనుకోవడం లేదని, ఆయన హుందాగా నడుచుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చురకలు అంటించారు.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
 
 పేదలకు లబ్ది చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ప్రజల్లో సన్న బియ్యంపై ఉన్న అపోహలను తొగించేందుకు ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలోని ఓ రేషన్ కార్డు లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్.. సోమవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

Also Read :  Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment