సామాన్లు సర్థుకో KTR.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు : ఎమ్మెల్యే రాజాసింగ్

కేటీఆర్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్‌కు రాజాసింగ్ సూచించాడు.

author-image
By K Mohan
New Update
Raja singh Murder sketch

ఈ ఫార్ములా రేసు నిర్వహణలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేటీఆర్ అరెస్ట్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. అందులో కర్మ ఎవరిని వదిలి పెట్టదని రాసుకొచ్చారు. నా మీద కేసు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జైలుకు పంపాయని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. ఆ గేమ్ ఇప్పుడు ప్రారంభమైందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్ చేశారు.  జైలుకు వెళ్లేముందు కొన్ని వస్తువులు తీసుకెళ్లండని ఆయన కేటీఆర్‌కు సూచించారు.

నాలుగు జతల బట్టలు తీసుకెళ్లాలి. ఎందుకంటే జైళ్లో కూడా ఫాషన్ అవసరం. ఓ దుప్పట, టవల్, హ్యాడ్ కర్చిఫ్, సబ్సు, ఓ డబ్బా పచ్చడి జైలుకు వెళ్లేముందు ప్యాక్ చేసుకోవాలని కేటీఆర్‌‌ను ట్యాగ్ చేసి ఎక్స్‌లో రాజాసింగ్ ట్వీట్ చేశారు. కటకలాల్లో ఉన్నప్పుుడు ఎమోషన్‌కు గురై ఏడుపు కూడా వస్తుందని.. కన్నీళ్లు తూడుచుకోవడానికి కర్చిఫ్ ఉండాలని అన్నారు. జైళ్లో ఉన్నా సరే.. శుభ్రంగా ఉండాలని అందుకే ఓ శుభ్రమైన టవల్ తీసుకెళ్లాలన్నారు. జైళ్లో ఫుడ్ బాగోదు కాబట్టి.. పచ్చడి బాక్స్ పెట్టుకెళ్లమని సెటరికల్‌గా అడ్వైజ్ ఇచ్చారు. 

అలాగే ఇప్పుడుంది చలికాలం కాబట్టి ఓ వెచ్చని స్వెటర్ కూడా తీసుకెళ్లాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు చెప్పారు. కర్మ ఎవరినీ ఊరికే వదిలిపెట్టదు.. అది సరైన టైం కోసం ఎదురుస్తుంది అంతే అని ఆయన ట్వీట్ లో రాశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతరులను టార్గెట్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో మీరు కూడా రుచి చూస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్‌లో రాశారు.

Read also : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ బిగ్ షాక్!

2022 ఆగస్ట్‌లో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దానికి కర్మగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారని రాజాసింగ్ ఈ ట్వీట్ చేశారు. ఓ వ‌ర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంది. 

Read also : లిక్కర్ స్కామ్ పార్టీని ఓడిస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు.

New Update
Sunstroke claims seven lives in Telangana

Sunstroke claims seven lives in Telangana

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు. 

Also Read: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్టా గ్రామానికి చెందిన గంగారం (55) వడదెబ్బ తగిలి మృతి చెందారు. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన రవళి(35), ఖమ్మం జిల్లా మధిర పట్టణం రామనాథం వీధిలో ఉంటున్న శేషాచారి (80), కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామంలోని కళ్లెం రమేశ్‌ (54), పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీలోని పుల్లూరి రమేష్‌కుమార్‌ (37), కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలోని కనక కాశీరాం (42), హైదరాబాద్‌లోని  లింగంపల్లి రైల్వేస్టేషన్‌ ఆరో ప్లాట్‌ఫాంలో ఉన్న ఓ యాచకుడు (70) మృతి చెందారు. 

Also Read: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఇది 3.6 డిగ్రీలు ఎక్కువ. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలో 44.3 డిగ్రీలు, మెదక్‌లో 43.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Also Read: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!

Also Read: పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

latest-news | summer | weather | weather-update | telangana weather updates | Summer Weather Update | rtv-news

 

Advertisment
Advertisment
Advertisment