Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హైటెన్షన్!

తెలంగాణలో బర్డ్‌ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలోని కొన్నూరు గ్రామంలో రైతు శివకేశవరెడ్డికి చెందిన 4వేల కోళ్లు చనిపోయాయి. దీంతో అతడు ఆవేదన చెందుతున్నాడు. వెటర్నరీ అధికారులకు తెలిపినా వారు స్పందించలేదని అతడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

New Update
Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry

Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry

గత కొద్ది రోజులుగా తెలంగాణ (Telangana) లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రోజుకు కొన్ని వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా ఒకేసారి 4వేల కోళ్లు మృతి చెందడం సంచలనంగా మారింది. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశవ రెడ్డి అనే రైతుకు ఒక కోళ్లఫామ్ ఉంది. దానిని దాదాపు 5,550 కోళ్ల కెపాసిటీతో నిర్మించాడు. 

4000 కోళ్లు మృతి

అందులో తాజాగా 4000 కోళ్లు మృతి చెందాయి. అయితే ఒకేసారి ఇన్ని కోళ్లు మృతి చెందడానికి పూర్తి కారణాలు తెలియకపోయినా.. బర్డ్ ఫ్లూ (Bird Flu) కారణంగా ఇలా జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగానే  ఇవాళ ఉదయం రైతు శివకేశవ రెడ్డి తన కోళ్ల ఫామ్‌కు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఫామ్‌‌లో వేల సంఖ్యలో చనిపోయి ఉన్న కోళ్లను చూసి చలించిపోయాడు. 

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

కంపెనీకి సమాచారం

నిన్నటి నుంచి కోళ్లు మృత్యువాత పడటాన్ని శివకేశవ రెడ్డి గమనించాడు. దీంతో వెంటనే తాను ఏ కంపెనీ నుంచి అయితే కోళ్లను తీసుకువస్తున్నాడో.. ఆ కంపెనీకి సమాచారం అందించాడు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ కంపెనీ శివకేశవ రెడ్డికి సూచించింది. ఇక బర్డ్ ఫ్లూగా అనుమానించిన అతడు చనిపోయిన 500 కోళ్లను బయట గొయ్యి తీసి పూడ్చేశాడు. 

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

అధికారులు పట్టించుకోలేదు

ఇక వరుసగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. అలా మొత్తంగా 4000 వేల కోళ్లు చనిపోయాయి. ఇక చేసేదేమిలేక వాటిని కూడా గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. అనంతరం వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంపై అతడు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించాడు. కానీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని అతడు ఆందోళనకు దిగాడు. ఇన్ని కోళ్లు చనిపోవడానికి గల కారణం ఏంటో చెప్పాలని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. దీనిపై అధికారులు నిర్ధారణ చేయాల్సిందేనని అతడు డిమాండ్ చేస్తున్నాడు. తీవ్రంగా నష్టపోయానని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment