Trains Canceled : ప్రయాణీకులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రూట్లలో ట్రైన్స్‌ రద్దు..

కాజీపేట, వరంగల్‌ రూట్లలో రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా. అయితే ఇది మీ కోసమే. ఈ రూట్లలో ఈ నెల 10 నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాజీపేట జంక్షన్‌ నుంచి వరంగల్‌ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

New Update
Kazipet Junction railway station

Kazipet Junction railway station

కాజీపేట, వరంగల్‌ రూట్లలో రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా. అయితే ఇది మీ కోసమే. ఈ రూట్లలో ఈ నెల 10 నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-విజయవాడ మధ్య ఇంటర్ లాకింగ్ వర్క్ బ్లాక్ కారణంగా ఈ నెల 10 నుంచి కాజీపేట జంక్షన్‌ నుంచి వరంగల్‌ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Delhi CM: ఢిల్లీ సీఎం ఎవరు ?.. రేసులో ఉంది వీళ్లే

Trains Cancelled From Kazipet - Warangal Routes

రాష్ట్రంలోని రద్దీగా ఉంటే స్టేషన్లలో కాజీపేట (Kazipet), వరంగల్ (Warangal) కూడా ముఖ్యమైనవి. ఈ రూట్లలో ప్రతి రోజు వందలాది ట్రైన్స్‌ నడుస్తుంటాయి. అయితే ఈ రూట్లలో ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ నెల 10 నుంచి ఈ రెండు స్టేషన్లనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్యాసింజర్లకు రైల్వేశాఖ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 10 నుంచి కాజీపేట, వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాజీపేట-విజయవాడ మధ్య ఇంటర్ లాకింగ్ వర్క్ బ్లాక్ కారణంగా ఈనెల 10 నుంచి కాజీపేట జంక్షన్ నుంచి వెళ్లే పుష్ ఫుల్ ప్యాసింజర్లు, వరంగల్ కాజీపేట మీదుగా నడిచే ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మల్లించినట్లు పేర్కొన్నారు. 

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్ (67765) పుష్ ఫుల్, డోర్నకల్-కాజీపేట (67766) పుష్ ఫుల్, దోర్నకల్-విజయవాడ (67767)పుష్ ఫుల్, విజయవాడ-భద్రాచలం (67215) సింగరేణి ప్యాసింజర్, భద్రాచలం-విజయవాడ (67216) సింగరేణి ప్యాసింజర్, గుంటూరు-సికింద్రాబాద్(17201) రైళ్లు రద్దు అయినట్లు రైల్వే శాఖ తెలిపింది.  ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు సికింద్రాబాద్-గుంటూరు (17202) ఎక్స్ ప్రెస్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (17234) ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 10,11,15, 18,19,20వ తేదీల్లో గుంటూరు-సికింద్రాబాద్(12705) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు (12706) ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!

 ఫిబ్రవరి 11,14,16,18,19, 20వ తేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్ (12713) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ (12714) ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం-ఎల్‌టీటీ ముంబయి(18519) ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 12 నుంచి 22వ తేదీ వరకు ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం(18520) ఎక్స్ ప్రెస్, ఈ నెల 18న మచిలీపట్నం-సాయి నగర్ షిరిడి(17208) ఎక్స్ ప్రెస్, 19న కాకినాడ పోర్టు-సాయినగర్ షిరిడి(17206) ఎక్స్ ప్రెస్, 20న సాయి నగర్ షిరిడి- కాకినాడ పోర్టు(17205) ఎక్స్ ప్రెస్ లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

New Update
TGSWREIS

TGSWREIS

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఇందుకు మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్‌ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. 

గతేడాది మొయినాబాద్‌ గురుకుల పాఠశాలలో మాత్రమే కోడింగ్‌పై శిక్షణ ఇచ్చామని.. ఇప్పుడు అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ శిక్షణ కోసం గురుకుల సంస్థ యూకేలోని లండన్‌కు చెందిన ర్యాస్ప్ బెర్రీపై పౌండేషన్ (RBF) తో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్, కరిక్యులమ్. మానిటరింగ్, టీచింగ్, యాక్షన్ ప్లాన్ వంటి వివిధ అంశాల్లో ఫౌండేషన్ నిర్వహకులు పాలు పంచుకోనున్నారు. 

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్‌లైన్ టూల్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు అంతా సిద్ధం చేశారు. గురుకుల సంస్థ ఈ కోడింగ్‌ శిక్షనను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రతి పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దీని ఫలితాలు మెరుగ్గా రావడంతో ఫౌండేషన్ ప్రతినిధులను గురుకుల అధికారులు ఒప్పించారు. అలాగే అన్ని పాఠశాలల్లో కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. 

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

గురుకులాల్లో కోడింగ్ శిక్షణలో భాగంగా విద్యార్థులకు 2 గంటల పాటు బోధిస్తారు. మరో రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారు. దాదాపు 1.52 లక్షల మంది విద్యార్థులకు కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా నేర్పించి పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేస్తారు. అయితే గురుకులాల్లో విద్యార్థులకు కోడింగ్ టెక్నాలజీని నేర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారని.. ఇదొక మైలురాయిగ నిలుస్తుందని సెక్రటరీ అలుగు వర్షిణి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోడింగ్‌ శిక్షణ, బోధన కోసం స్కూల్స్‌లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా తీసుకొస్తామని చెప్పారు.  

Advertisment
Advertisment
Advertisment