Meals: ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత..

నారాయణపేట్‌ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
poison

Food Poison In Narayanapet District Schools

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. నారాయణపేట్‌ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. 

Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!

దీంతో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు.. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో కొందరికీ ప్రాథమిక చికిత్స అందించి వాళ్లకు ఇళ్లకు పంపించారు. మరో 9 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వీళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మరికొందరికీ పాఠశాల వద్దే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు.. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Also Read  : రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి..

 మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. '' ఇవి గురుకులాలా లేక నరక కుపాలా అంటూ ధ్వజమెత్తారు. పాఠశాలల లేక ప్రాణాలు తీసే విషయ వలయాలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి గిరిజన గురుకులంలో కూడా ఓ విద్యార్థిని ఫుడ్‌ పాయిజన్‌తో అనారోగ్య పాలై 20 రోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతంటూ పేర్కొన్నారు. అలాగే బుధవారం నల్లగొండ జిల్లాలో ఓ విద్యార్థి పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు నేర్చుకోవడం కాదు, ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు. 

Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ..

Also Read: రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment