Cyber Crime: సంచలన సైబర్ స్కామ్.. 3 గంటల్లో రూ.49 కోట్లు స్వాహా
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు.
దివాళి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఫేక్ నోటిఫికేషన్స్, URL లింకుల ద్వారా 390 మందిని మోసం చేసి, రూ. 8.5 లక్షలు కొట్టేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
సైబర్ మోసాలు పెరుగుతున్నప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగికి ఆశ చూపారు. అది నిజమని నమ్మిన సదరు ఉద్యోగి నిండా మునిగాడు.
బెంగళూరుకు చెందిన ఒక ఒంటరి మహిళ పెళ్లికోసం చేసిన ప్రయత్నాలు ఆమెను నిండా ముంచాయి. కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడి కోసం ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించుకోవడానికి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. ఇంటర్నెట్, ఆన్లైన్ గేమ్ల లాభనష్టాల గురించి పిల్లలకు వివరించాలి. ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను గమనిస్తే.. వారి ఆన్లైన్ కార్యకలాపాలను తప్పకుండా తనిఖీ చేయాలి.
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాలు ఎంచుకుని మరీ సైబర్ కేటుగాళ్లు అమాయకులు వల విసిరి లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కూతురు ఆన్లైన్ గేమ్లో సైబర్ నేరగాడి వేధింపులకు గురైందని వెల్లడించారు. అపరిచితుడు ఆమెను నగ్న చిత్రాలు పంపమని అడిగాడని అన్నారు. ఇది పెరుగుతున్న సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం డిజిటల్ అరెస్టు కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులే కాకుండా చదువుకున్న వాళ్లు, ప్రొఫెషనల్స్ కూడా వీటి ఉచ్చులో పడి లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో మరో డిజిటల్ అరెస్టు చోటుచేసుకుంది.