Crime News: సికింద్రాబాద్లో తల్లి శవంతో 8రోజులు.. ఇంట్లో గడిపిన ఇద్దరు కూతుళ్లు
సికింద్రాబాద్ ఓ మహిళ చావు మిస్టరీగా మారింది. లలిత చనిపోయిన 8 రోజులు అవుతున్నా ఆమె ఇద్దరు కూతుళ్లు మృతదేహం ఇంట్లోనే ఉంచి బయటకు తెలియనివ్వలేదు. శుక్రవారం వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు డెడ్బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.
సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 50 మందికి పైగా..
మధ్యప్రదేశ్లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో తండ్రి, కుమారుడు మృతి!
ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు.
AP CRIME: షకలక బూంబూం ఆట మిగిల్చిన విషాదం.. 6ఏళ్ల చిన్నారి మృతి!
ఆరేళ్ల చిన్నారి షకలక బూంబూం ఆట ఆడి తన ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. న్యూయర్ వేడుకల వేళ తన స్నేహితులతో కలిసి షకలక బూంబూం ఆట ఆడింది. అందులో చిన్నారికి మంటలు అంటుకున్నాయి. దీంతో 27రోజులు చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది.
Cyber Crime: హైదరాబాద్లో 52 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు.. బ్యాంకు మేనేజర్ సహా..!
డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్ సహా 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వారి నుంచి చెక్బుక్లు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం!
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని హత్య చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కత్తితో చెల్లిని పొడిచి చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.
Road Accident: రోడ్డు ప్రమాదంలో పదవతరగతి విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తున్న సమయంలో టిప్పర్ లారీ యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ కు లారీ తగిలి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు.
/rtv/media/media_files/2025/02/01/ALj5J1JgqbGr2z6lndgT.jpg)
/rtv/media/media_files/2025/01/31/c02R71iJLd7N6aX32YWP.jpeg)
/rtv/media/media_files/2025/01/30/OpucgesU3HsV4dRQbZIi.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
/rtv/media/media_files/2025/01/29/EqxS4S6WFQol82j9xhZM.jpg)
/rtv/media/media_files/2025/01/29/qD8hJUafjtYjnqGi5J54.jpg)
/rtv/media/media_files/2024/11/15/MMEOGCRhPgILBbQh4EUc.jpg)
/rtv/media/media_files/2025/01/28/Nq8h9JRMLpqmGHLjDn98.webp)