Sunita Williams : నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..

భారత సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్ రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది.

New Update
Sunita Williams : నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..

American Astronaut : భారత(India) సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్(Sunita Williams) రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ లాంచ్(Rocket Launch) అవ్వాల్సి ఉంది. కానీ చివరి సమయంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే దీన్ని ఆపేశారు. అప్పటికే వ్యోమనౌకలో ఉన్న సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం తమ మిషన్‌ను వాయిదా వేస్తున్నామని నాసా ప్రకటించింది. అయితే మళ్లీ ఎప్పుడు రోదసి యాత్ర చేపడతారనేది ఇంకా చెప్పలేదు.

Also Read: అన్ని రకాల కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్..

అయితే ఈ మిషన్‌ ద్వారా భూకక్ష్యలోని ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్ (ISS)లో వారం రోజుల పాటు బస చేయాలనేది ప్లాన్. స్టార్‌లైనర్ వ్యోమనౌకను తయారు చేసేటప్పుడు అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్‌లైనర్ తొలి యాత్ర ఐఎస్ఎస్‌ను చేరుకోలేకపోయింది. మరోసారి యాత్ర చేపట్టగా పారచూట్‌లో సమస్యలు వచ్చాయి. దీంతో చాలా ఏళ్ల పాటు ఆలస్యం జరిగింది. ఇప్పుడు సాంకేతిక లోపంతో మరోసారి ఆగిపోయింది. అయితే ఇది తర్వాతైనా సక్సెస్ అయితే.. ఐఎస్ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఇప్పుడు ఈ సేవలు అందిస్తోంది.

ఈ రోదసి యాత్రలో సునితా విలియమ్స్ మిషన్ పైలట్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఇది ఆమెకు మూడో అంతరిక్ష యాత్ర. గతంలో కూడా 2006,2012లో ఆమె రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. గతంతో వెళ్లిన రోదసి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన సునితా.. ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. కానీ ఈ మిషన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇది నిలిచిపోయింది. మళ్లీ ఈ రోదసి యాత్ర ఎప్పుడు చేపడుతారనేది తెలియాల్సి ఉంది.

Also Read: వరల్డ్ కప్‌ టోర్నీకి ఉగ్ర ముప్పు.. ఆ దేశం నుంచి బెదిరింపులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతులకు భారతీయుల రక్తం అనేక సార్లు అంటుకుంది. అసిమ్ మునీర్ గతంలో ISI (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. భారత్‌పై జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక అసిమ్ మునీర్ హస్తం ఉంది. ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్ అంనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో పర్యటకులపై జరిగిన టెర్రర్ అటాక్‌ను 3 రోజుల ముందు అసిమ్ మునీర్ కాశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. అది తమ ప్రధాన రక్తనాళమని ఆయన చెప్పాడు. ఈ వ్యాఖ్యలతోనే రెచ్చి పోయి లష్కరే తో యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉద్రవాద సంస్థ కశ్మీర్ లో అటాక్ చేసిందని ఇండియన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు భావిస్తున్నారు. అంతేకాదు 2018 నుంచి భారత్‌పై జరిగిన టెర్రర్ అటాక్‌ల కుట్రల వెనుక అసిమ్ మునీర్ ఉన్నారని కొన్ని సందర్భాలని పరిశీలిస్తే అర్థమవుతుంది. 

2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 40 మంది CRPF సైనికులు అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. ఈ దాడి జరిగినప్పుడు అసిమ్ మునీర్ ISI చీఫ్‌గా ఉన్నాడు. ఐఎస్ఐకి తెలియకుండా ఇంత పెద్ద ఉగ్రదాడి జరగదని భారతదేశం నమ్ముతుంది.

2016 జనవరి 2న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో ఏడుగురు భారతీయ భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. అసిమ్ మునీర్ 2018 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించినందున ఆయన అప్పుడు ISI చీఫ్ కాదు. ఈ దాడుల వెనుక ISI, పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మునీర్ ఆ ఉగ్రదాడిలో కీలక కుట్రదారుడని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

Advertisment
Advertisment
Advertisment